పుట:సకలనీతికథానిధానము.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

163


తే.

కొలువు సేయంగ నాఖగకులము వచ్చి
యున్న గృధ్రమ్ము దమకును సన్న సేయఁ
బులియు నక్కయు నప్పక్షికులముఁ జంపి
పిదప గృధ్రంబుఁ జంపి నిర్భీతులయిరి.

193


వ.

అట్లు గావున గృధ్రంబు బుద్ధివిహీనంబు ఖగపతిత్వంబునకునర్హంబు గాదనిన వాయసంబు కపింజలంబు బట్టంబు గట్టుదమనిన మయూరం బది యర్హంబుగాదని యిట్లనియె.

194


క.

నిలయమునకు శశము గపిం
జలమును బోరాడి యొక్కశార్దూలయతిన్
వలగొనిఁ జెప్పినవిని నే
దెలిపెదనని చెప్పుచును వధించెను వానిన్.

195


క.

హీనులు తమలోఁ గలహం
బైనను నృపు డెఱుంగకుండ నడఁపక క్రూర
క్ష్మానాథున కెఱింగించిన
ప్రాణము లిరువు(రకు నొ)క్కభంగిన పోవున్.

196


వ.

అట్లు గావున కపింజలం బవివేకియని జీవంజీవకంబు బట్టంబుగట్టుదమనిన నదిగాదని శారిక యిట్లనియె.

197


సీ.

వినుడు కేరళదేశమునఁ బ్రసేనుండను
        క్ష్మాపతి కుష్ఠరోగమునఁ బొంద
వైద్యుడొక్కరుఁడు జీవంజీవకము దేక
        మాన దీరోగ మేమందులందు
ననిన శాకునికుల ననిపిన వారును
        నరిగొక్క[1]సరసిని నురులుదీర్ప
కొక్కెర యురిఁబడ్డ నక్కటా యని యొక్క
        పొన్నంగి యురిఁ ద్రెంపవోయి తాను

  1. దుస్సంధి