పుట:సకలనీతికథానిధానము.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

167


ఆ.

ఇతరజాతులైన హితుఁ బ్రోచు నొక్కొక
యెడరుపుట్టి నప్పుడెఱుక వొడమి
యెండ్రి విప్రుప్రాణ మెత్తెను కాకంబు
గళము బిగియఁబట్టి కాననమున.

179


వ.

ఆబ్రాహ్మణుండు గంగయందు నక్కర్కటకంబు బెట్టి స్నానంబు చేసి చనియెఁ గావున.

180


క.

అని హరులు బుద్ధి చెప్పఁగ
వినియును విననట్ల హరుల వెదకుఁచు నన్నిం
టిని మెసఁగి చనియె బామున
కును పాలిడి పెంప విషము గురియక చనునే.

181


వ.

అని తంత్రి దాదిం జూచి యిట్లనియె.

182


క.

పలువురు పగతులలోనికిఁ
బలవంతుఁడ ననుచు నరిగి ప్రహరుషలీలన్
బలుమారు జెప్పుకొనెనే
బ్రళయంబగుఁగాక యెట్లు ప్రాణము నిలుచున్.

183


వ.

అది యెట్లనిన.

184


సీ.

జలనిధిదరిఁ బక్షిసంఘము తమ కొక్క
        యధిపతి వలెనని యాత్మఁ దలఁచి
పరశురామునిచేత భంగముబొందిన
        క్రౌంచపర్వతము రంధ్రమునఁ బుట్టి
నట్టియంచను ఖగపట్టబద్ధునిఁ జేయఁ
        దగబరద్వేషిణి ధ్వాంక్ష మనియె
కలహంస నిర్బుద్ధి గద్దఁ గట్టుదమన్న
        నర్హంబుగాదు వింధ్యాద్రియందు