పుట:సకలనీతికథానిధానము.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158

సకలనీతికథానిధానము


వ.

ఇది యెట్లనిన.

160


సీ.

వ్యవహారు లిద్ద ఱాయసము నోడనునిచి
        వనధి జనద్వీపమునకు నరుగ
నంత నొక్కఁడు రోగియై పోవలేకున్న
        నొకఁ డేగి బంగారునకును మార్చి
కొని తెచ్చి యేకాంతమున నమ్మికొనఁ దోడి
        వ్యవహారి పాలు ద న్నడుగుటయును
యెలుకలు దినిపోయె నినుమంతయును నీకుఁ
        బాలు వెట్టగలేదు పసిఁడి యనిన


ఆ.

నతని తనయుఁ డింటి గాడంగ వచ్చిన
డాఁచి యతఁడు వచ్చి తనయు నడుగ
గ్రద్దయొకటి గొంచు గగనంబునకు నేఁగె
ననుచుఁ గపటవృత్తి నడలుటయును.

161


క.

జనపతికి విన్నవించిన
మనుజేంద్రుం డనియె గ్రద్ద మానిసి నెటుగాఁ
దినె ననిన లోహ మెలుకలు
దినినట్టుల గ్రద్ద శిశువుఁ దినెనని పలికెన్.

162


ఆ.

జనవరుండు పసిఁడి సమభాగ మిప్పింప
నతనికొడుకుఁ దెచ్చి యప్పగించె
నమ్మిపెట్టినట్టి సొ మ్మీని విశ్వాస
పాపి యనుచు వైశ్యుఁ దాపెఁ బురికి.

163


వ.

మఱియు నొక్కకథ వినుమని యిట్లనియె.

164


సీ.

సింధుమతీపుర క్షితిపతి చచ్చిన
        గొడుకు లిద్దఱు తండ్రి పుడమి పంచి
కొని రాజ్య మేలుచుఁ గూడి వేఁటకు నేగి
        సేన గూడఁగలేక చిక్కుటయును