పుట:సకలనీతికథానిధానము.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

139


తే.

యిట్టిభవము మెఱయ మహీశసుతుఁడు
......సకలసైన్యంబు గొలువనుజ్వ......
....................నీపురి నధివసించి
చెలువుమీరంగ రాజ్యాభిషిక్తుఁ డయ్యె.

42


వ.

ఇంక నొక్కకథ చెప్పెద వినుమనిన.


సీ.

ఇలనిలా వర్షంబు నేలువజ్రుండును
        జనపతి నలువురు సచివవర్తుల
వరగృహాసన వస్రవాహనస్త్రీలను
        రినక్రొత్తగాఁబెట్టుఁడనినవారు
నట్ల చేయుచునుండ నందులో నొకమంత్రి
        వరుసకుఁ గన్నియ దొరకకయున్న
చింతింప నిమ్మంత్రి చెలికాఁడు వరరుని
        తంత్రినాఁదగు కన్య తనతనూజ


మంత్రివరునకు నిచ్చి యమ్మగువ వజ్ర
హనునిముందట నిడు మిది యఖిలకళలు
నెఱుఁగుఁ గథఁ జెప్పనేర్పు భూమీశ్వరునకు
నన్యచిత్తంబు లేకుండ నాదరించు.

43


(ననిన నమ్మంత్రివరుఁడును నట్ల సేయ)


తే.

దాదియనుచరగాఁగ నత్తంత్రికన్య
యుర్విపతిఁ గూడి సుఖగోష్ఠి నున్నవేళ
మక్కు వలరంగ నుపమాతదిక్కు చూచి
యొక్కకథ జెప్పె నమ్మాత యోకొనంగ.

44


వ.

కుంజరపురంబున నొక్కసార్ధవాహుండు బేరమువోవుచున్న నతనియెద్దు నడవిలో జిక్కిన విడిచిపోయిన నెద్దు లావుకొని ఱంకె వేసిన.

45