పుట:సకలనీతికథానిధానము.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

137


సీ.

వినమితుండగుచు దీవెన బొంది మత్సఖు
        (విధము నెఱుంగుదే) విమలనయన!
యెచ్చటనున్న వాడెఱుఁగు దే నెఱిగింపు
        మనిన మహాశ్వేత యనియె నప్పు
డొక్కసుకుమారకుఁ డొంటి నావెనువెంటఁ
        దిరుగుచు ననుఁ బట్ట కరము చాపం
గోపించి శుకమవై కూలుము నీ వని
        శపియింప విప్రుఁడు వచ్చె ననిన


తే.

అవనిపతి పుత్రుఁడును కవితాసుఁడైన
పత్రరేఖాదు లరిగి యప్పాటు చెప్ప
నంత కాదంబరీకాంత యరుగుదెంచి
దుఃఖమున పత్రరేఖయుఁ డురుగమణిని

33


వ.

వాగె పట్టుకొని శోకావేశంబున మరణంబు బొందెదనని యక్కొలన మునిఁగిన నయ్యశ్వంబు కపింజులుండను ముని యయ్యె నంతట శ్వేతకేతుం డచ్చటికిం జనుదెంచి దుఃఖంపుచున్న కాదంబరీ మహాశ్వేతా పత్రరేఖల నూరార్చె నప్పు డది విని తారాపీడశుకనాసులు నచ్చోటి కేతెంచి రంత.

34


క.

చిలుకై వైశంపాయనుఁ
డెలమి న్వహియించె నంత నిందుఁడుఁ జొచ్చెన్
లలిఁజంద్రపీడు దేహం
బలవైశంపాయానాఖ్యుఁ డబ్జుం డయ్యెన్.

35


వ.

అని జాబాలి మునీంద్రుండు ఋషులకు వినిపించుట విని యే నచ్చోటు వాసి యొక్కశ్యపచనివాసంబుపై త్రోవగా నరుగుదేర నొకమాతంగకన్యక నన్ను బట్టికొని తోలుఁబంజరంబున నిడియె నంత.

36