పుట:సకలనీతికథానిధానము.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

సకలనీతికథానిధానము


తే.

ఇందుబింబమ్ము వెడలొక సుందరుండు
పలికె నిట్లని రెండవభవమునందు
నీకు బతియగు వీఁడు నో నీలవేణి
యనిన నూరడి యేఁ దపమాచరింతు.

29


సీ.

అని వినిపించి నాయనుఁగు నెచ్చెలి మది
        రా చిత్రరథుల గారాపుదనయ
కాదంబరీ నామకన్యక గలదు నీ
        కిప్పింతు రమ్మని యిందుపీడుఁ
గొనిచని యాకాంతకును వివాహము సేయ
        నీపత్రలేఖ నయ్యెడను నిల్పి
జనకువ్రాలాకు వచ్చినసైన్యములఁ గూడి
        యాత్మపురంబున కరుదెంచి


తే.

జనకునకు మ్రొక్కి తగినదీవెనల బొంది
మంత్రికశునాసుఁ డాత్మకుమారు నడుగ
నతఁడు ననుఁగూడి రాడయ్యె నడన జిక్కి
నన బలాహకుఁ డిట్లనె నవనిపతికి.

30


క.

భూతావేశంబున శుక
రీతుల బల్కుచును నెవ్వరికిఁ దీర్పఁగ రా
కాతరువులలో దిరుగుచు
నేతరియైయున్నవాని నెటు (దేనొప్పన్).

31


వ.

అని బలాహకుండు వినిపించిన దారాపీడుండు కుమారునిఁ జూచి నీ వేమి చేసితివో (యని) కోపించిన నేఁ బోయి తోడ్కొని వచ్చెద నని బలాహకసహితుండై పురంబు వెలువడి యమ్మహా.....యాశ్రమంబున కరిగి యప్పుడు.

32