పుట:సకలనీతికథానిధానము.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

127


క.

తనచావు దప్ప దీబ్రా
హ్మణు గాచెదఁ జావకుండ నది యెట్లనినన్
మును విప్రుఁ జంపి మణి గొని
నను జంపకమానరని మనంబున దలఁచెన్.

369


వ.

అని తలంచి యచ్చోరుండు దొంగలతో నిట్లనియె.

370


ఆ.

బ్రాహ్మణుండు నాకు బావ నేమఱఁదిని
హాస్యభాషణంబు లాడుకొనఁగ
సత్య మనుచు దలఁచి చంపెదరైతి
నన్నుఁ జంపి మణులు గన్న పిదప.

371


క.

మఱి విప్రుఁ జంపుడనఁ ద
స్కరునిన్ వధియించి వానిజఠరములోనన్
వరమణులు లేకయుండిన
ధరణీసురు గాఁచి చనిరి తస్కరజనముల్.

372


క.

అవివేకి చెలిమికంటెను
వివేకి యెడ వైర మొప్పు విపినంబున భూ
దివిజుని గాచెం జోరుం
డవనీశుఁడు క్రోఁతిచేత హతముం బొందెన్.

373


వ.

అది యెట్లనిన.

374


సీ.

ఒకనాఁడు నృపతి వేఁటకు నేఁగి మర్కట
        శిశువునుఁ దెచ్చి పోషింపఁ బెరిగి
యదియు వర్ధన బొంది యధిపతిహితచర్య
        వర్తింప నాసన్నవర్తిఁ జేసి
ఖడ్ల మొక్కటి దానికరమున కందిచ్చి
        యేనిద్ర బొందెద నీవు నన్ను
బోతుఁటీఁ గైననుఁ బొలయంగ రాకుండ
        గాచుండు మెవ్వరేఁ గదిసిరేని