పుట:సకలనీతికథానిధానము.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

సకలనీతికథానిధానము


సీ.

తామ్రశేఖరమనఁ దనరు పురంబున
        వృషకేతుఁ డనియెడు వృషలసుతుఁడు
హరికూఁతురగు కందుకావతి మోహించి
        తోకొని మఱియొకత్రోవ నరుగ
నడవిలోఁ దస్కరు లడ్డగించిన వారి
        వధియించి యొకపురవరము చేరి
కోమలి నొకపాడుగుడిలోన నునిచి యా
        కటికి నన్నముఁ దేర గవని చొచ్చి


తే.

యరుగుచో సుమ యనియెడు నాఁటదొకతె
యన్న మిడియెదరమ్మని యతనిఁ గొనుచుఁ
దనకు నేలికసానైన తరుణిఁ గూర్చ
నిందురేఖను గలిసి వాఁ డింతి మఱువ.

293


తే.

కందుకావతి యాగుడికడనె యుండ
వైశ్యుఁడొక్కఁడు గొనిపోయి వనితఁజూడ
యెలుకలను జంపి తనసత్త్వ మెన్నుకొనిన
బూర్వనాథుని విజయంబు బుద్ధి దలఁచి.

294


వ.

వైశ్యుం డధముండని వానిఁ గలయరోసి ప్రాణంబు విడిచిన వైశ్యుండును దనధనంబు రా జపహరించునని దానంబుచేసి యర్థనాశం బయ్యెనని చచ్చె నంత.

295


ఆ.

ఇందురేఖ మఱచి కందుక మఱచు ట
న్యాయ మనుచు శూద్రుఁ డాత్మఁ దొరఁగె
నింతటికిని హేతు వేనని నిలువక
దోసమునకు వెఱచి దాసిచచ్చె.

296


వ.

వీరిలో నెవ్వరిమరణం బధికం బనిన విక్రమార్కుం డిట్లనియె.

297