పుట:సకలనీతికథానిధానము.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

సకలనీతికథానిధానము


క.

జనపతి సమ్ముఖమునకుం
జని భూవర వీని నేల చంపగ నీకున్
ధన మెంతైనను నిచ్చెద
ననుటయు విన కతండు తత్పురాంగణసీమన్.

217


తే.

కొఱ్ఱు వాతించి తస్కరుఁ గొఱఁత వేయ
వాఁడు దుఃఖంచి నవ్వి జీవంబు విడువ
నంత నాధీరవతియును నగ్గిఁ జొరఁగ
దగ్గరుటయును శివుఁడు బ్రత్యక్షమగుచు.

218


తే.

అతనిప్రాణంబు గృపచేసి హరుఁడు చనియెఁ
గొఱితిపై నుండి దుఃఖంబు గుడిచి పిదప
నవ్వె నేటికి జెప్పుమా నరవరేణ్య!
యనిన విక్రమసూర్యుం డిట్లనుచు బలికె.

219


క.

ధనమెంత తనకు నిచ్చిన
వినఁడయ్యెను, నృపతి, దనకు విధియని యేడ్చెన్
వనజాక్షి యగ్ని చొరగాఁ
జనజూచిన నవ్వె నిదియ (సత్యం) బనినన్.

220


వ.

ఎప్పటియట్ల తిరిగి పరచినం బట్టితెచ్చునెడ బేతాళుఁ డిట్లనియె.

221


సీ.

నేపాళదేశమహీపతియగు కీర్తి
        కేతునిసుత (యొప్పు) గీరవాణి
చంద్రిక నాగ వసంతోత్సవంబున
        వనితఁ జూచెను ఘనస్వామియనెడు
విప్రకుమారుండు వెలఁదియు నవ్విప్రు
        దగఁజూచె మోహ మిద్దఱికిఁ బొడమె
నతివ యంతఃపురి కరుగ ఘనస్వామి
        చెలిమూలదేవుడన్ సిద్దయోగి