పుట:సకలనీతికథానిధానము.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

99


సీ.

రత్నకాంచీపురిరాజు యశఃకేతు
        డనునృపుఁ డంగరాజాధివరుఁడు
దీర్ఘదర్శనుమంత్రి తెరువు చెప్పిన సము
        ద్రము సొచ్చి పాతాళతళమునందు
నిర్జనపురమునఁ (నెలఁత) నొక్కతెఁ జూడ
        నట భూతతిథి నొక్కయసుర మ్రింగ
రాక్షసుజఠరంబు వ్రచ్చి యక్కాంతను
        వెడలింప నృపునకుఁ బడతి యనియె


తే.

పొత్తునకు రాక తా నన్నభుక్తిఁ గొనక
నన్ను శపియించె తండ్రి దానవుఁడు మ్రింగు
ననుచు మఱి వానిఁ జంపిన యతఁడు నీకు
రక్తుఁ డని పల్కి శాపవిముక్తి యొసఁగె.

202


క.

అది గావున నను గైకొను
మిది నాయభిలాష యనిన నింతిని గొనుచుం
బదపడి పురి కేతెంచిన
నది మంత్రికుమారుఁ డెఱిఁగి యసువుల బాసెన్.

203


వ.

అమ్మంత్రి మరణంబునకు గారణం బెద్ది యనిన విక్రమార్కుం డిట్లనియె.

204


క.

ఆదివ్యకాంతఁ గలసిన
భూదయితుఁడు మత్తుఁడగుచుఁ బొరిగొను నన్నున్
భేదించు మంత్రి తమ్మును
శ్రీ దరుగఁగఁ జేయునని యచేతనుఁడయ్యెన్.

205


వ.

అనవుండు.

206