ఆర్యసమాజము
మానవజీవితము సుఖమయముగావింప ననువగునట్లు జీవిత కాలము బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వాన ప్రస్థము. సన్న్యాసము అనబడు ఆశ్రమములుగా నాలుగు భాగములు చేయబడెను. ఐదేండ్ల తరువాత బాలురు ఇరువదియై దేండ్లవరకును, బాలికలు పదునారు యేండ్లవరకును గురుకులములందుండి బ్రహ్మచర్యము సలుపుచు విద్య నభ్యసించ వలెను.
అటుపై శాస్త్రవిహిత గృహస్థ ధర్మములను నిర్వర్తించి ఏబది యేండ్లకు పైబడినతదువరి వానప్రస్థులగుట మానవుల కుచితము. తదుపరి సాంసారిక జీవనమును గడుపరాదు. వానప్రస్థులు గ్రామమునకు వెలువలనుండి సంఘమున కుపకరించు కర్తవ్యముల నాచరించుచు స్వాధ్యాయాదులను చేయుచుండవ లెను.
క్రమముగా సాంసారిక భోగములనుండి విరక్తులై సన్న్యసించి బ్రహ్మనిష్ఠులై జీవితమును సఫల మొనర్చుకొనుట సన్న్యాసాశ్రమ విధి.
V. సంస్కారములు :- మానవజీవితమును పరిష్కరించుటకుగాను నిషేకాది శ్మశానాంత షోడశ విధ సంస్కారములను ఆయా కాలమున జరుపుట శ్రేయస్కరమనియును సమాజ మంగీకరించును.
VI శుద్ధి మత పరివర్తనము :- ఏమతమునకు చెందిన వారైనను వైదిక ధర్మమార్గము నవలంబింతు మందు రేని యట్టివారి నార్యసమాజము వైదిక మార్గ మున దీక్షితుల నొనర్చును. వేదధర్మముల ననుసరించుటకు సర్వ మానవులకు నధికారమున్నది. అందు జాతిభేదము కానీ, వర్ణ భేదము కానీ, దేశ భేదము కానీ పాటింపబనిలేదు. వేద ములు సార్వకాలిక సార్వభౌమ ధర్మ ప్రతిపాదకములు. అవి ఈశ్వరీయములు. కాబట్టి ఒకరి సొత్తుగ భావింపజనదు. విశ్వమునంతటిని ఆర్యమొనర్చుటకు ఆర్యసమాజ మనుదినము ప్రయత్నించుచున్నది. "కృణ్వంతో విశ్వమార్యమ్' ఇది దానినినాదము. అందువలన నేడు క్రైస్తవ మహమ్మదీయాది నామములచే వ్యవహరింపబడువారు వేదధర్మ పరులు కానెంతు రేని ఆర్యసమాజము వారికి సదా స్వాగత మిచ్చి వేదమార్గమును ప్రదర్శించును.
ఆర్యసమాజము మానవజీవనమునకు సంబంధించిన ఎల్లవిషయములను వైజ్ఞానిక సూత్రానుకూలముగ పరిష్కరింప యత్నించును. అది విశ్వాసములకును మూఢాచారములకును తావీయదు. అది సర్వతోముఖ మగు మానవాభ్యున్నతికే కాక సర్వప్రాణికోటి హితము నాకాంక్షించి తదను కూలాచరణమునకు గడంగును.
ఆర్యసమాజ నిర్మాణము :- సమాజ నిర్మాణము ప్రజాతంత్ర పద్ధతుల ననుసరించి చేయబడినది. పదునెనిమిది సంవత్సరములు దాటిన ప్రతి వ్యక్తియు నీ సమాజమున సదస్యుడు కాదగును. కనీసము పదిమంది సభ్యులతో నొక సమాజము స్థాపింపనగును. సమాజమున సదస్యుడు కాదలచినవ్యక్తి తన యాదాయమునందు శతాంశమునకు తక్కువకాని ద్రవ్యమును చందారూపమున సమాజమున కొసగవలసియుండును. అతడు సమాజముచే సూచింపబడిప సదాచార నియమములను పాటింపవలసి యుండును.
ప్రతి సమాజమును నియమానుకూలముగ నడుపుటకు తగినట్లు సమాజ సదస్యులు తమలో కొందరిని కార్యకర్తలనుగా నెన్నుకొందురు. వారిలో అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధ్యక్షుడు, పుస్తకాధ్యక్షుడు ముఖ్యులు. వీరితోబాటు మరిముగ్గురిని చేర్చి ప్రతి సమాజమునకు నొక కార్యనిర్వాహక వర్గము (అంతరంగసభ) ఏర్పరుపబడును. సదస్యులు మిక్కిలిగానున్నచో అధికారుల (కార్యకర్తల) సంఖ్య యథోచితముగ బెంచుకొనవచ్చును.
ఇట్టి సమాజము లొక ప్రాంతమున పదికిమించి యేర్పడిన తదుపరి యా సమాజ సదస్యుల ద్వారమున ఎన్నుకొనబడిన ప్రతినిధులతో నొక ప్రాంతీయ ఆర్య ప్రతినిధిసభ యేర్పడును. సమాజములు ప్రతి యిరువది మంది సదస్యుల కొక ప్రతినిధి నెన్నుకొని ప్రాంతీయసభ నేర్పరచుకొనును. సమాజమున నున్నట్లు ప్రతినిధి సభ యందును అధికారు లెన్నుకొనబడుదురు. ప్రతి ఆర్య సమాజము తన యాదాయమునందు పదియవవంతు ద్రవ్యము ప్రతినిధిసభకు చేర్చును.
ఇట్టి ప్రాంతీయ ఆర్యప్రతినిధి సభలనుండి యెన్నుకొనబడిన ప్రతినిధుల మూలమున సార్వదేశిక ఆర్య ప్రతినిధి సభ యొకటి నిర్మింపబడును. ఆసభాకార్యములను నిర్వహించుటకు ప్రాంతీయ ప్రతినిధిసభలు తమ యాదాయమున పంచమాంశము చందారూపమున నిచ్చును.