Jump to content

పుట:సంకీర్తన లక్షణం.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క॥వరదానంబున నైనను।
గురుముఖమున నైనఁ దెలిసికొను కవిపలుకుల్।
పరమామృతమౌ లేదా।
దురహంకృత కవిత నోరఁదోఁడండ్రు బుధుల్ ॥22॥

గీ॥సంప్రదాయాగత జ్ఞానసహితుఁడైన।
మనుజు సత్కవితయు వేదమంత్రసమము।
లదియ చాలదె శ్రీవేంకటాచలేశు।
చరణములు గను మనువునశ్చరణ మేల ॥23॥

క॥పదమగును సుప్తిజింతము।
పదమవయవమవయవియును పదమనఁబరఁగుం।
తుదినీ తెఱంగులన్ని యుఁ।
పదకవితా మార్గ సార్వభౌముఁడు దెలిపెన్ ॥24॥

అందు నవయవ పదం బెట్టిదంటేని-----

క॥విదిత చరుష్పాదంబగు।
నది వృత్తం, బదియధాతు, వవయవ సంజ్ఞం।
బదియ యని యన్నయార్యుఁడు।
పదిలముగా భరతశాస్త్ర పద్ధతిఁబలికెన్ ॥25॥

ఈ వృత్తంబులకు ధాతుసంజ్ఞ లెట్లయ్యె నంటేని-----

వృ॥వాతముఁబిత్తముం గఫము వర్ణిత సర్వశరీర ధారణా।
హేతువులయ్యఁగావున మహింజెలువొందెను ధాతుసంజ్ఞ నీ।
రీతినె వృత్తముల్ పదశరీర సముద్భవ కారణంబులై।
ధాతు సమాఖ్యలందె భరత ప్రముఖాఖిల మౌనిసమ్మతిన్ ॥26॥