పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర థ మ స్కం ధ ము.

55

దండోపాయంబులలో దండం బజ్ఞాతబలులయెడ నవిధేయంబు. స్తుతియుఁ బొసంగ దేల
యన నాయందు వీరు దుర్బలత్వంబు పెట్టుదురు, దాన భేదంబులకుం దఱికాదు. కావున.

-: బ్ర హ్మ కృ త వి ష్ణు యో గ ని ద్రా స్తు తి :-



ఉ. వెన్నుని శేషశాయిని వివేకఘనాశ్రయునిం జతుర్భుజున్
    సన్నుతి సేసి మేల్కొలిపి సాగిలి మ్రొక్కెద భక్తి యుక్తి మై
    న న్నతఁ డేలఁగాఁగలఁడు నాదు విచారము దీర్పఁగాఁగలం
    డెన్నఁగ నింతకంటెఁ గలదే మఱియొక్కటి యంచు వేడుకన్. 222

వ . అని.223


సీ. ముక్తపదగ్రస్తము :
    భణనీయగుణపాలి పాలితభూచక్ర చక్రగదాభుజా చారుదండ
    దండసాధనతాత తాతప్రియకుమార మారసుందర గరుత్మత్తురంగ
    రంగదర్ణవరాజ రాజన్మహాలయ లయకాలకీలికీలాప్రతాప
    తాపససంతాన తానవార్తివిఫాల ఫాలబాలసుధాగభస్తి బింబ

తే.గీ. బిందితులితాధరా ధరాలంబమిత్ర | మిత్రమండలగతగాత్ర గాత్రధీన
    ధీనమచ్ఛ్రీసుఖనిదాన దానవారి | వారిజాసనకారణ కారణాత్మ. 224

చ. నిరోష్ఠ్యము.
    నళినదళాక్ష దీనజననాయక నీరదగాత్ర శంఖ స
    ద్గళ నరసింహ దైత్యగణదారణ నారదనాదసాదరా
    గళగరళార్చితా సకలకాంతశరీర ధరాధరాతిని
    శ్చలనయ నిత్య సత్యకృత సాధన శార్ఙ్గహృషీకనాయకా. 225

ఉ. ఈ దనుజేంద్రు లిద్దఱు మహేశ మదోద్ధతులై ననుం గడున్
    బాధలు పెట్టఁబూనిరి కృపామయ మచ్ఛరణంబ వీవకా
    దే దురితాత్ములం దునిమి తేకువ న న్బ్రతికింపవే యిఁకన్ .
    సాదరవృత్తి నంచు నిటు లాతఁడు శ్రీహరి నెంతవేడినన్. 226

తే.గీ. యోగనిద్రాగతుండయి యున్నకతన | శౌరి మేల్కొనకున్న న జ్జలజభవుఁడు
    శక్తితోఁ గూడి నిద్రావశతన యుండె ! నేమిసేయుదు మేల్కొల్పు టెట్టు లితని.227

ఉ. ఎక్కడఁ బోవుదున్ మఱియు నెవ్వరు నన్ను భరించువార లే
    దిక్కొ యఖర్వగర్వ నిరతిం దనుజేంద్రులు చుట్టుముట్టిరే
    స్రుక్కితి నంచుఁ దా నరసి చూచి మనంబునఁ గొంతవట్టు నా
    కొక్క యుపాయ మిత్తఱి నహో ! పొడకట్టె నటంచు నెంచుచున్. 228