పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

శ్రీ దేవీ భాగవతము

    గ్రీవుఁడ కాక వేఱొకటి గీల్పడ దెన్నఁ డటంచుఁ దెల్పి య
    ద్దేవి యదృశ్య యయ్యె మదిఁ దృప్తి నతండును నేగె నింటికిన్. 187

ఉ. వాఁడు వరంబు పేర్మిఁ గడు వర్ధిలు గర్వము పూని యజ్ఞముల్
    పాడొనరించి మౌనులను బాధలఁ బెట్టుచునుండ వానికిన్
    సూడొకరుండు ముజ్జగము చోటుల లే డది గాన వానికిన్
    బీడ యొనర్ప మీకిపుడు ప్రీతియుకా యిఁక వేయు నేటికిన్. 188

ఆ.వె. హయముశిరము దెచ్చి యతికింపుమనుఁడు మాధవుని ముండెమునకుఁ ద్వష్టతోడ
      నంత విష్ణుఁడే హయగ్రీవుడై యేగి | యా సురారి నోర్చు నద్ధి మేలు. 189

వ. అని మరియు సూతుండు. 190

క. అని యిట్లు దేవి పలికిన | విని సుర లెల్ల రును దృప్తివిస్తరులై త్వ
   ష్టనుఁ జూచి పల్కి రిట్లవి | యనఘా నీవేగి హయము నాస్యముఁ దెమ్మీ. 191

తే.గీ. తెచ్చి యదికింపు మచ్యుతు దేహమునకు | ననిన నాతండు నట్లచేసిన మురారి
   హయగళుండయి దనుజుని హతునిఁజేసె | దాన దేవత లెల్ల సంత సముపడిరి.192

క. ఈకథఁ జదివిన వినినన్ | లోకజనని తా నొసంగు లోకాతీత
   ప్రాకట వైభవమేధా , శ్రీకాంతి చిరాయువులను సేమం బొదవన్. 193

-: మ ధు కై ట భో త్ప త్తి :-



క. అని చెప్పిన సూతమహా మునితోడను శౌనకాదిమును లందఱు ని
   ట్లని మునిమూర్థన్యా | యనఘా మా సంశయంబు లడగింపఁగదే. 194

చ. జగ మేకార్ణవమై తలిర్చునెడ భాస్వద్రూపుఁడై విష్ణుఁ డే
    పగిదిం బంచసహస్రహాయనము లబ్రాశిన్ రణప్రాజ్ఞతన్
    దగి యోర్చెన్ మధుకైటభాసురుల దుర్దాంత ప్రతాపాఢ్యులన్
    నగభేది ప్రముఖామర ప్రకర నానాదుఃఖసంపాదులన్. 195
 
మ. పరమాశ్చర్యకరంబ యిచ్చరిత మొప్పం జెప్పవే సూత యీ
    పరమౌనివ్రజ మెల్లఁ జేరి వినఁగా వాంఛించుచున్నారు దు
    స్తర నానార్థవిదుండవై సఖుడవై దైవప్రసాదంబునన్
    దరి కేతెంచితి వీవు నీ చెలిమిచేతల గల్గు నిష్టార్థముల్. 196

క. వెస మూర్ఖుని సహవాసము | విసమే సజ్జనుల చెలిమి వెలయంగ సుధా
   రసమే యిది దెలియనిచో , పసరమకా నరుండు వేయిపలుకు లికేలా. 197