పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మ స్కం ధ ము.

37

తే.గీ. సదసదాత్మకమైన యీ జగము నెల్ల నోలిఁ బుట్టించి రక్షించి యుక్కడంచి
    తన త్రిగుణశ క్తిఁ గల్పవేళను నొకర్తు | నిలచు లోకై కమాతను నే స్మరింతు.17

తే.గీ. అజుఁడు జగ మెల్ల సృజియించు ననుచు వేద | వేత్తలు పురాణకథల గొంతెత్తి చెప్పి
    వార లా బ్రహ్మ శ్రీమహావాసుదేవు | నాభిజుం డని రస్వతంత్రతయ కాదె ?18

శా. వైకుంఠుం డహిశయ్యఁ గూర్కుతరి దేవజ్యేష్ఠుఁడుం బుట్టె ని
    చ్ఛాకేళిం దదుదారనాభి సఖిల వ్యావృత్తి నాధార శో
    భాకల్పుండు సహస్రమౌళియ కదా ప్రాల్మాల కుద్బోధ వి
    ద్యాకుం డాహరి కమ్మురారి భగవ ద్వాచ్యుండు దా నెట్లగున్. 19

తే.గీ. సలిలములు రసరూపముల్ జగతియెల్ల | నిండి యేకార్ణవంబయి యుండు నాడు
    జలధికినిఁ బాత్రరూపక శక్తి యగుచు ! సకల భూతంబులనుఁ గన్న జనని గొల్తు. 20

చ. ఉరువెఱ యోగనిద్ర హరి యుండఁగ సారసమందు నున్న యం
    బురుహభవుండు భక్తి మెయిఁ బూజ యొనర్చిన దేవి నా కొగిన్
    శరణ మటంచు నమ్మి యనిశంబును నిర్గుణముక్తి ధాత్రి బం
    ధురగుణ విశ్వమాతఁ దలఁతున్ వినుపింతుఁ బురాణ మర్మిలిన్. 21

మ. మునివర్యు ల్వినుఁ డీర లాదరమున్ మున్నూటపద్దెన్మిదై
    చను నధ్యాయములున్ గణింప దినరాట్సంఖ్యాకమౌ స్కంధముల్
    పొనరన్ శ్లోకములున్ బదెన్మిదగు వేలున్ సంస్కృతం బందునున్
    దనరన్ వ్యాసుఁడు సెప్పె భాగవతమున్ దాక్షిణ్య సంయుక్తుఁడై. 22

గీ. మొదటి స్కంధంబునను నిరుఁబదియు, రెంటబదియు రెండును, నూటముప్పదియు నాలు
    గింట నిరుబదియైదు నైదింట నెన్న | ముప్పదైదును నాఱింట ముప్పదొకటి. 23

తే.గీ. నలుబదేడింట నిరుఁబది నాలు గెనిమి | దింట, నేఁబదియగు తొమ్మిదింట, బదింటఁ
    బదియుమూడగు నిక నిరుఁబదియునాల్గు ! పదునొకొండింట, బదునాల్గు బదియు రెంట. 24

వ. ఇవ్విధంబున నిమ్మహాభాగవతఁబున స్కంధాధ్యాయ శ్లోకసంఖ్యలు పరిగణింపంబడు.
    మఱియు సర్గంబునుఁ బ్రతిసర్గంబును మన్వంతరంబులును, వంశంబులును, పంశాను
    చరితంబులును నను నైదు లక్షణంబులు కలదియై మహాపురాణంబునాఁ బ్రసిద్ధి
    గనుచుండు నదియుం గాక. 25

చ. నిరవధిక ప్రపూర్ణ గణనీయము నిర్గుణ నిత్యయున్ వికా
    రరహిత యోగగమ్య శివరమ్య మహోత్తమయుం దురీయ యై
    వఱలెడి శక్తి సాత్త్వికత, భార్గవి రాజసతన్ ద్రిలోక సృ
    ట్చరరుహనేత్ర తామసత శాంకరియంచుఁ బ్రసిద్ధయై తగున్. 26