పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

-: గురుపరంపరాస్తుతి:-


శ్లో. రఘునాధప్రధానా ద్యామ్ , గంగ రాణ్మంత్రి మధ్యమాం
    కన్నయామాత్య పర్యంతామ్ | వందే గురుపరంపరామ్ ||

వ . అని గురువందనము చేసి,

-:శ్రీ రఘునాథ రావు ప్రభావము:-


శా. శ్రీశ్రీశ్రీ రఘునాథ భూమివిబుధా గ్రేవర్తి సత్కీర్తియై
    శ్రీశ్రీశ్రీపునహాపురీ వికటభూ రిక్ష్మా మహారాష్ట్ర సు
    శ్రీశ్రీశ్రీయగు ధారువాడనగరీ - జేగీయమానస్థితిన్
    శ్రీశ్రీశ్రీయయి గోలకొండకును విచ్చేసెన్ రణోద్యోగియై ||

ఉ. వచ్చి తురుష్కభూమిపర • వర్గము నుగ్గొనరించి సేనలన్
    జెచ్చరఁ గొంచుపోపుతరి • సేహి సుసాహెబుఁ డొంటిఁ బట్టి తాఁ
    దెచ్చెనుఁ గార కంతటను • దేవిఁ దలంచి విముక్తుఁడయ్యు వాఁ
    డెచ్చటి కేగెనో యెఱుఁగ • రేరు వనస్థితి మెచ్చి యుండుఁ బో ||

చ. అకుబరు చక్రవర్తి యెపుఁ • డాతనికిన్ జయపూరు సీమ యే
    లిక జయసింహుఁ డల్లుడు లలిన్ హయమేధము రామచంద్రయా
    జకుఁ డతిమానుషుం డవని జానినిఁ దా నొనరింపఁజేసె మా
    నక యపు డస్మదీయ రఘునాథుఁడు వచ్చెను గోలకొండకున్

-:హ రి దా స్ గం గా జీ ప్ర భా వ ము.:-


ఉ. ఉండెను గోలకొండను ద దుజ్వలమైన యశంబుతోడఁ బు
    త్రుం డొకరుం డుదారగుణ రూఢిమెయిన్ హరిదాసవృత్తి న
    క్కొండిక గంగజీ యనుచుఁ • గూరిమి నెల్లరు బిల్చి రా మహా
    మండలమందె భూసుర కుమారికఁ బెండిలియాడె నాతఁడున్ ||

-:దా సు ర ఘు నా య క ప్ర భా వ ము.:-


చ. నయమతియై యతండు రఘు నాయకుఁ గాంచెను నాడు వాని య
    న్వయమును దాసువారనుచు . వాడిరి నాటికిఁ జక్రవర్తి ని
    శ్చయముగ షాజహానుఁడు లసద్గుణశాలి యతండు భీతి త
    క్కియ చని కాంచె నబ్బుడుత కీసులతో బుడుతండు బందరున్