ఈ పుట ఆమోదించబడ్డది
దేవీ భాగవతము
చ. వినఁబడె ముల్గు పాపయ కవిప్రవరుం డొక వందయేండ్లకున్
మును వెలిగించి భాగవతమున్ సరసంబుగనంచు, దీని ము
ద్రణమున నాల్గు స్కంధములు దాటినవెన్క; నతండు నాదు వం
దనముల కర్హుఁ డెంతయును ధన్యుఁ డతండుగదా ధరాస్థలిన్ .
చ. తిరుపతి వేంకటేశ్వర సుధీమణుల న్గొనియాడి మ్రొక్కెదన్
సరసులు నాకు మిత్రులును సర్వజనస్తవనీయపాండితీ
భరితయశుల్ తెలుంగునను భాగవతంబు రచింపఁ బూనిరం
చెరిగితి వారివల్న గణియుంపరు నా యపరాధపుంజమున్.