పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ య స్కం ధ ము

139


తే.గీ. మనముదహియించుచున్నది మౌనివర్య | యేమి సేయుదు సదుపాయ మెద్ధినాకు
దెలిపి రక్షింపపే శాంతి గలుగఁజేసి | తండ్రిదుర్గతిఁ దొలఁగెడి దారిఁచెప్పి.364

-: వ్యాసజనమేజయ సంవాదము :-
వ. అనిన విని సకల వేదవిభాగ వివిధవిన్వాసుండగు వ్యాసుండు నిఖిలశత్రుంజయుండైన
    జనమేజయున కిట్లనియె.365

సీ. రాజేంద్ర వినుము సర్వపురాణములలోన బరమోత్తమంబైన భాగవతము
   విన్పించెదను నీవు విను మిది మున్ను నా సుతుఁడై యెసఁగురున్న శుకమునికిన
   దగఁ జెప్పితిని దీన ధర్మంబు నర్థంబు కామంబు మోక్షంబు గలుగు సకల
   శుభముల నొసఁగును సుఖదంబు సర్వాగమసముద్ధృతంబు నిర్మల మనఘము

తే.గీ. నావుడు నరేంద్రు కిట్లను నమ్రుడగుచు యజ్ఞ విఘ్నార్ధ మాస్తీకుఁ డతరమయన
   రాఁ గతంబేమి గూఢసాద్ద్రక్షణమున నతని కేమిప్రయోజనం బనఘ చెపుమ. 366

క. అతిమాత్రయోగమహిమా | న్వితభాగవతంబు వినఁగ ...........
   దతలీల దాని వెల్పుము | శతధాకిల్బిషములెల్ల సమయఁగఁ గృపతో.367

వ. ఇట్లు దీనాననుండై వినయపూర్వకంబుగా నడిగిన జనమేజయు పలుకు లాలించి
    వ్యాసుండు ఓ జనవరా! తొల్లి జరత్కారుండను ముని గృహస్థాశ్రమంబొల్లక తిరుగు
    చుండ నౌక యరణ్యంబున గర్తప్రదేశంబుల స్తంభంబు లడ్డుకొని వ్రేలాడు తన
    పితరులం గాంచి, యయ్యలారా! మీరిట్లిచ్చటనుండఁ గతంబేమయని యడిగిన
    నోయీ! నీవు దారసంగ్రహంబుజేసినంగాని మేము తృప్తులముగాము స్వర్గప్రాప్తికి
    హేతువుగా మా చెప్పిన విధంబున నీవు సదాచారపరుండవు గమ్మనిన నతండు.368
 
తే.గీ. సమసమాఖ్యయు ...గ యేచానయేని | నాకు లభియించెనే నమ్ముఁడట్టి
    దానిఁ బెండ్లాడఁ దలచితిఁ తథ్యముగ న టంచు పనివినెఁ దా దీర్థ యాత్రకపుడు.369

తే.గీ. పన్నగంబుల నగ్నిలో బడుతటంచు దల్లి శపియించెఁ గనలి యత్తరిని సుమ్ము
    తత్కథను దెల్పెదను వసుధాతలేశ వినుమనుచు బల్కె మౌని విస్తరముగ.370
 
సీ. మునినాథుఁడగు కశ్యపునిభార్య లిరువురు వెలయఁ గద్రువయును వినతయు సని
    వారు చూచిరి సూర్యు వారువంబొకదానిఁ జూచి కద్రువ తల యూని విసత
    కనియె నీసూర్యుని యశ్వ మేవర్ణంబు గలదని యది విని కలికి బలికె
    తెల్లని దిదియంచుఁ దేటమీరఁగ నంతఁ గాదు నల్లనిదిని కద్రుప యన

తే.గీ. పంతములు బట్టి రొగిఁ బరస్పరము వార లపుడ కద్రువ వినతితో ననియె రేవు
    వచ్చిచూతము చూచిన వన్నెయేరి దామెకును దాసిగాఁదగు నన్యయనుచు.371