పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

శ్రీ దేవీ భాగవతము

శా. దేవీయజ్ఞమటంచు నొక్కసుఖ మెంతేనిం బ్రయత్నింపుమా
   త్రోవంబన్ను - సర్పయాగము ననన్ దుఃఖాంబు పూరంబు కణా
   గ్రేవల్ గ్రమ్మఁగ నయ్యయో జడుఁడనై కృత్యం బుపేక్షించితిన్
   జేవం దండ్రికి వైరులైన భజగశ్రేణుల్ దయార్హంబులే.354

తే.గీ. నేడయజ్ఞంబు మొదలిడి నేనొనర్తు | భుజగములనెల్ల నగ్నిలోఁ బొరలఁగాల్తు
   ననుచు మంత్రులఁ బిలిచి య య్యవనినాథుఁ డనియె నిట్లని తనలోని యలుకపేర్మి.355

క. జన్నము గావించెద నే। నన్నయమార్గమన మంత్రిసత్తములారా
   పన్నింపుఁ డన్ని విధములఁ జెన్నుగ సంభారములను శీఘ్రమె మీరల్.356

సీ. మందాకినీతీరమందు శుభంబైన భువి జూఁడుమనుఁ చెల్లి భూసురులను
    సలలితంబుగ నూఱు స్తంభముల గల మండపమును గట్టింపు డేఏర్పాటుచేసి
    నేనును ధర్మపత్నినిఁగూడి కూర్చుండ నమరింపుడీ మంచి యజ్ఞవేది
    పరగహుతాశన ప్రబలకాకరమురా హోమగుండముద్రవ్వుఁ డొప్పమీర

తే.గీ. దక్షకుఁడు యజ్ఞపశువుగాఁ దలపుఁడింక | హోత యుత్తంక భూసురుం డుండుగాక
    విప్రవర్యుల వేదార్థ విధుల నిఖిల | మంత్రవేత్తలఁ బిలువుండు మంత్రులార.357

తే.గీ. మంత్రు లట్లనకావింప మ.... డలరి యజ్ఞమునుసేయఁ డొడగిన యపుడు సర్ప
    తండములు పడె దద్దోమగుండమునను | తక్షకుడు భీతి నింద్రుని దాపు జేరి.358

క. మొరపెట్టిన నింద్రుడు దాఁ గరణన్భయముడిపి తనదు గద్ధియమీదన్
   శరణమొసఁగె నది మదిలో నెఱుఁగుచు నుత్తంకుఁ డహిని సేంద్రునిఁ బిలచెన్.359
 
తే.గీ. అపుడు తక్షకుఁ డడలి నిజాప్తుడైన యట్టి యాస్తీకు మౌనికులాగ్రగణ్యుఁ
   దలఁపగా జనమేజయు దరిసి యతఁడు దీవనలొసంగఁ గోరిక దెలుపుమనుచు.360
 
క. నృపుడడిగిన విప్రుడు దాఁ గృపతో యజ్ఞంబు విడువ నేఁ గోరెద నా
   నపుడే సత్యము తప్పని నిపుణత యజ్ఞంబుమాని నిశ్చలబుద్ధిన్.361

క. ఘనుఁడగు వైశంపాయన | ముని దా విన్పింప వినియె ముదమున సర్వం
   బును భారతమందును దన మనమునకు న్శాంతిలేక మానవపతి దాన్.362

ఉ. వ్యాసమహర్షి గాంచి నృపవర్యుఁడు నామదిశాంతి యెట్లగున్
    ద్రాసము దోచెడిం బలువిధంబుల వీరులు స్వర్గలోకసం
    వాసము గోరినం దనువుఁ బాయుట మేలు రణంబులో నిజా
    వాసములో భుజంగవిష బాధను దండ్రి గతించె నయ్యయో.363