పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ య స్కం ధ ము.

137


చ. వనమున నొక్క డుండుభము వాడు గనుంగొని కొట్టఁబోవగా
    వినయముమీర నిట్లనియె విప్రకుమారక తప్పు లేని న
    న్నును వధియింపనేటికి ఘనుండవు నీవన నాతడిట్లనున్
    నను వరియించియున్న యొక్క నాతిని సర్పముముట్టెగావునన్.342

క. అగపడినపాములను నే దెగవైచెదననుచుఁ ప్రతిన దీర్చితిననఁ దా
   వగచుచు నే నెవ్వారినిఁ | బనకొని కఱువంగలేడు పాములుకఱుచున్.343
 
ఆ.వె. కాళ్లులేనిమాత్రఁ గాను నే భుజగంబ | నేల నన్నుఁ జంపె దేగుమనియె
   ననుచుఁ చెప్పి మరియు ననియె నుత్తంకుండు | విపులబుద్ధియైన నృవునిజూచి.344

ఆ.వె. అపుడు రురుఁడు డుండుభాలాపములు విని యెవఁడవవు నీకు నిట్టిరూప
   మెట్లు గల్గెననిన నేను బూర్వము శాంతి | నమరియన్న యుర్వరామఠుఁడను.345

అ.వె. కడఁగి మిత్రుఁడైన ఖగమాభిధుం డగ్ని హోత్రగృహమునందు నుండఁజూచి
   గడ్డిగట్టి పాముగఁజేసి యతనిపై వైవ భీతిచెంది వడకికొనుచు.346

క. ననుజూచి కనలి శపియించెను సర్పమవగుదుమంచు జెచ్చెర నే నా
   తనికాళ్ళ కెరగినన్ నను గనుగొని యిట్లనుచు బలికె కారుణ్యమునన్.347
  
క. ప్రమతికొడుకు రురునాముఁడు విమలమతిని నిన్ను మరల విప్రునిజేయుం
   బ్రమదంబు బొందుమనె ద త్క్రమమన నిట్లైతి విప్ర ధన్యచరిత్రా. 348

క. ఆ విప్రుఁడ నేను రురుడ | నీ వా శాపంబువలన నే నిటులై తిన్
   బ్రోవుము నన్ను నహింసయె యీ ననుమతి ధర్మములకు నెల్ల మొదలగున్.349

క. దయచే సత్యవ్రతమగు దయయే ..... పెద్ద తథ్యము వినుమా
   దయయే శౌచము ధర్మము దయకెక్కుడు లేదు లేదు తలపగ నెందున్.350

క. అన విని రురుఁడుం బ్రాహ్మణుఁ । గని శాపం బిపుడ విడుచుగావుత మనినన్
   దనరె నతఁడు తక్షణమే మనుజుండై పిదప రురుఁడు మానెను హింసన్.351
 
చ. చెలగి రురుండు కోమలిని జీవితజేసిఁ వివాహమయ్యే న
    య్యలఘుఁడు సర్పతండములయం దతివైరము పూనె నీవు దు
    ర్బలువలెఁ దండ్రికిం బరమ బాధకవృత్తి నటించినట్టి పా
    ములపయిఁ గ్రోధమింతయనుఁ బూనవు నీకిది చెల్లునే నృపా.352

మ. పితృవైరంబు దలంప విద్ది తగునే పృథ్విన్ పితృక్షోభులన్
    హతి గావింపనివాడు జీవసహితుఁడె యుండఁగా నేమి దా
    మృతుఁడే యండ్రదిగాక తద్రిపువులన్ హింసించకున్నేని పు
    త్రతయున్లేదు తదీయదుర్గతులు దూరంబౌనె యెందేనియున్.353