130
శ్రీ దేవీ భాగవతము
సీ. తొయ్యలిమేనక స్థూలకేశుని యాశ్రమమునకుఁ బోయి సమ్మద మెలర్ప
మూడులోకములందు నీడుగానని యొక్క ముద్దుబాలిక నతిమోహనాంగి
గని యచ్చటనె డించి చన ముని దానిగైకొని గృహమును జేర్చి యనుపమమగు
ప్రేమతోఁజూచుచుఁ బెంచి ప్రమద్వరా నామంబు నునిచె నందఱునుమెచ్చ
తే.గీ. నంత నయ్యింతి నవయౌవనాంగి యగుచు | పింతవింతహొయల్ మేన విస్తరిల్ల
నప్పుడప్పుడు పూఁతోటలందుఁ జూచి, రురుడు సుమశర శరపరంపరల మునిగె. 264
—: పరీక్షిచ్ఛాప నివృత్త్యుపాయచింత :—
వ. ఇట్లు కామార్తుండై రురుండింటికిం బోయి నిద్రాహారంబులు మాని కృశించుటంగాంచి
యతని తండ్రి నాయనా యిది యేమి యని యడిగిన నతండు తండ్రి కిట్లనియె.265
శా. తండ్రీ! యేమని చెప్పుదున్ మదన సంతాపంబు లోలోనఁ దా
వేండ్రంబై నది స్థూలకేశునిసుతన్ వీక్షించితి న్వేల్పు ప్రో
యాండ్రన్ గూఢవదాంగనాజనమునం దాసొంపు నే గాని నా
తీండ్రింపు ల్కడముట్టు ముద్దియను బ్రీతిన్సుద్దులాడంగదా.266
ఉ. అంతట నేగి యాప్రమతి యత్యధికంబగు భక్తి మీర న
భ్రాంతత స్థూలకేశిపదపద్మము లంటి నమస్కరించి యో
శాంతమనస్క నీ తనయ సాధ్విఁ బ్రమద్వర నిమ్ము పెండ్లిగా
వింతము నాసుతున్ రురువుఁ బ్రీతిమెయిం బ్రతికింపు నావుడున్.267
తే.గీ. ప్రమతి దా స్థూలకేశు సంబంధమునకుఁ గడునలరి పెండ్లియత్నముల్ నడుపుచుండ
వనములో నొక్కసర్సంబు వనితపాద | మంటఁగఱచినఁ బడి సచ్చె నప్పుడచట.268
క. పడినప్రమద్వరఁ గనుగొని గడగడ వడకిన సమస్త కాంతలు పురుషుల్
గడు హెచ్చెను హాహారవ మడలెను జడదారిపల్లె యాసమయమునన్.269
క. రురుడుం జాటుగ మాటుగ నరిగి విరహవేదనాగ్ని యందుంబడి తాఁ
బొరిపొరి నేడువసాగెన్ బరిణయకాలమున నిట్టి పా టొదపుటకై.270
తే.గీ. దైవమా యేడనుండి యీత్రాచువచ్చె వచ్చెబో యేటికీ ముద్దువనితఁగఱచె
నేమిచేయుదు నిది దుఃఖహేతువయ్యె | నెందుఁజొచ్చెద బ్రాణంబు లెందుకింక.271
సీ. అయ్యయో మదిలోని యాశలెల్లను దీర నెనసి ముద్దియఁ గౌగిలించనైతి
దేవుడా పెండిలితిన్నెపైఁ గూర్చుండి పాణినైనను నేను బట్టనైతి
వగలాడితో హుతవహునిలోపల లాజహోమమైనను జేయ నోమనైతి
గొనగొన నేఁబోయి గుండ్రాతికడ నిల్చి చక్కగాఁ బదమైనఁ ద్రొక్కనైతి