పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ య స్కం ధ ము.

129


క. ఆముని ధ్యాసపరుండై యేమియు నెరుగండుగాన నింతట ఘనతే
   జోమూర్తి దాంతచిత్తుడుఁ । ధీమహితుఁడు మిత్రసంగతిం దిరుగునెడన్.253
 
వ. అమ్ముని కుమారుండు.254

క. తనదండ్రి కంఠసీమను | జననాధుం డొకఁడు సర్పశవ మిడెనని చె
   ప్పిన మిత్రుల మాటలు విని | చనుదెంచి కనంగ నద్ది సత్యంబాయెన్.255

తే.గీ. కనలి యంజలిజలమిడి కణకణయని | కనులు నిప్పులురాలంగ జనుడెవండు
   తండ్రిమెడ సర్పశవమిడెఁ దప్పకతఁడు | సప్త దినములఁ జచ్చు దక్షకునిచేత.256

క. అని శపించిన వార్తను | మునిశిష్యం డొకడు వోయి భూపతికి నివే
   దన సేయఁగ విని యాతఁడు । మనమును దుఃఖాంబురాశి మగ్నముసేసెన్.257

తే.గీ. అయ్యయో యనివార్య మీ యమికుమారు | శాప మిదియేమిపాపంబు సంభవించె
   ననుచు మంత్రులఁ బిల్పించి యడిగె నేయుపాయ మీశాపముక్తికి ననుచు నతఁడు.258

చ. వినుఁడు వచింతు నిందును వేరొకవీలు ఘటింపనేర దే
   మనిన నుపాయమార్గమున నౌరగహాలహల ప్రతిక్రియన్
   గననగుఁ దొల్లి యొక్క మునికాంత భుజంగమదష్టయయ్యు దా
   మనియె నటంచు బల్కుదురు మానవయత్నము కొంత కాఁదగున్.259

తే.గీ. మనుజుయత్నంబులేక యేపనియుఁ గారు | ఇలవిరక్తుండయేని దా నింటనింట
    దిరుగఁదగు భిక్షకొరకునై తిరుగ కొక్క చోటఁ గూర్చున్న బోనంబు నోటబడునె.260
 
వ. అనిన మంత్రులు.261

క. ఆముని యెవ్వం డాతని | కామిని పేరేమి యెట్లు గరిచెను సర్పం
   బామీద నేమిజరిగెను భూమీశ్వర తెలుపుమయ్య పూర్తిగ ననినన్.262

సీ. భృగుపులోమలు గన్న బిడ్డండు చ్యవనుండు పెండ్లాడె శర్యాతి బ్రియతనూజఁ
   గన్య సుకన్యనా కాంతయుఁ బ్రమతిని గనియె నాతడు ప్రతాపిని వరించి
   ప్రేమ మీరఁగ దానిఁ బెండ్లాడె నంతట నది రురువును గాంచె నప్పుడొక్క
   స్థూలకేశుఁడను దొడ్డతపసి సత్యశీలుఁడైవర్తిల్లె నోలి నప్పు

తే.గీ. డచ్చరవెలంది మేనక యనెడి దొక్క యాపగాతీరమున గ్రీడ లాచరించి
   పరగ విశ్వావసునిచేతఁ బ్రాప్తమైన గర్భమునుదాల్చి యొక వింతకళలఁ దనరి.263