ద్వి తీ య స్కం ధ ము
127
క. ముని సంధ్యాకాలము రాఁ | గవి వారల, దోడికొనుచు గంగకుఁ జని యం
దున స్నాతుండై దేవి | న్మనమున ధ్యానించె నిట్లు మఱి మఱి భక్తిన్.238
ఉత్సాహ. ప్రకృతివీవ పురుషుఁడీవ పాంచభౌతికప్రపం
చకమునీవ సకలమీవ చంద్రుఁడీవ తిగ్మరో
చికుఁడవీవ నభమునీవ క్షితివినీవ నేరమెం
చకుము నన్ను బ్రోవుమమ్మ శక్తి దేవి భగవతీ.239
ఉత్సాహ. అజుఁడవీవ శివుడవీవ హరివినీవ యా హవి
ర్భుజుఁడనీవ పాశివీవ పుణ్యమీవ యాజక
వ్రజమునీవ యాజివీవ వాయువీవ కశ్యప
ప్రజవునీవ ప్రోవుమమ్మ భగవతి మహామతీ.240
కురంగప్రయాతము. మణిద్వీపనేత్రీ మహామంత్రశక్తీ
గుణోపేతగాత్రీ గురుశ్రీకమూర్తీ
ఘృణా శాలినీ నీ కిదే మ్రొక్కినాడన్
బ్రణామంబు లాధారశక్తీ సుయుక్తీ .241
భుజంగ ప్రయాతము. సమస్తంబు నీయందు సంభూతమయ్యెన్
సమస్తంబు నీముందు సంపుష్ఠమయ్యెన్
సమస్తంబు నీయందు సల్లీనమయ్యెన్
మముం బ్రోవ నీవే యుమాశక్తి రావే.242
క. మృతులం జూపుమనుచు ని య్యతివలు ప్రార్థించి రెట్టులగు నాచేతన్
గతి నీవే యని నమ్మితి చతురత జూపింపుమమ్మ చయ్యనఁ దల్లీ.243
తే.గీ. ఇట్లు వ్యాసుండు ప్రార్థింప నిద్ధ చరిత యీశ్వరేశ్వరి భగవతి కృపదలంచి
స్వర్గముననుండి కోరిన జనులఁ బిలచి | చేర రప్పించి చూపించెఁ బేరువరుస.244
తే.గీ. కుంతి సంతోషమందెను గొడుకు జూచి | చెలగె గాంధారిబిడ్డలఁ జేరి కాంచి
యలరెను సుభద్రతనయునొయ్యఁ దిలకించి దేవి మహాత్మ్యమును వ్యాసు తెలివి గనుఁడి.245
తే.గీ. మౌని ప్రార్థింప భగవతి మహిమఁ జేసి ! యింద్రజాలంబుజూపిన ట్లెల్లవారు
మరిగి రొక్కొక్క రమరేంద్రపురికి నంత బినివినిరి మునివరులును బాండవులును.246
వ. తదనంతరంబ వ్యాసమహిమ లుగ్గడింపుచు ధర్మజుండు హస్తిప్పురంబు బ్రవేశించే
నని చెప్పి సూతుండు వెండియు నిట్లనియె.247