పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ య స్కం ధ ము.

119

   నాకుం గతిఎద్ది యని వగచుచుంటి నా కొండొకచింత గలదని నేను నీయెదుట నెట్లు
   వచింతునని తలవాంచి యూరకున్నంగని దేవవ్రతుండు వృద్ధబ్రాహ్మణులం బిలిపించి
   తండ్రియున్న విధంబును దన కతండు లజ్జచేఁ జింతాకారణంబు దెలుపకుండుటయుం
   జెప్పిన వార లరిగి భూనాయకు నడిగివచ్చి యథార్థంబు తేటపడం దెలిపిన పని
   గాంగేయుండు. 150

క. భూసురులఁగూడి దివిజనదీసుతు డద్దాశుఁజేరి తేటపలుకులన్
   నీసుత మాతండ్రికి ని మ్మీ సతిగా ననుచు నడుగ మేలని యతడున్. 151

క. నాసుతను నీవు కొనినన్ | భాసురముగ దానికొడుకు ప్రభువై ప్రబలున్
   వాసిగలిగి నీవుండగ గాసిగదా రాజునకును గన్నె నొసగినన్. 152
 
ప. అనిన గాంగేయుండు.153

మ. వినుమా దాశవరేణ్య నీతనయ పృధ్వీనాధు సేవించినన్
    జనదే నాకును దల్లియై పిదపఁ దజ్జాతుల్ సుతుల్ రాజ్యమున్
    గొనగా నేర్తురు నేను రాజ్యమును గైకోల్సేయకుండం దలం
    చినవాడ న్మది నమ్ము మేటి కిఁక నీ చింతల్ దయం బ్రోవుమీ.154

క. అనిన విని దాశుఁ డిట్లను | ననుమానయితేటు సత్య మావల నీకున్
    దనయుండు కలిగి బలిమిం | గొనలేడా రాజ్యమెల్లఁ గుటిలుం డగుచున్.155

క. నావుడు భీష్ముం డిట్లను | నో వివిధవిధిజ్ఞ పెండ్లి నొల్లక ధృతిమై
    గావించెద భీష్మవ్రత | మీ వింకం జిందనొంద నేటికిఁ జెపుమా.156

క. విని యంత పల్లెదొర దాఁ | దన తనయన్ శంతనునకుఁ దగ నొసఁగి సుశో
    భనముగ బెండిలిఁ జేసెం | జనవిభు డెఱుగండు వ్యాసు జన్మము సుండీ.157

-: ధృ త రా ష్ట్రా ద్యు త్ప త్తి :-


సీ. మునులార యివ్విధంబున సత్యవతి శంతనుని బెండ్లియాడిన వెనుక నాపె
    యిరువురు తనయుల నెనసె వారలు బోయి | రవల దద్భార్యలయందు వ్యాసు
    వీర్యంబునను బుట్టె వింటిరకా ధృతరాష్ట్రుండు గృడ్డియై రాజ్యమునకుఁ
    బాత్రుండు గాడాయెఁ బాండురాజును బుట్టె విదురుండు దాసియం దుదయమయ్యె

తే.గీ. ప్రథమ కన్నులుమూయుటఁ బట్టి కొడుకు చీకువాడాయెను ద్వితీయ చేరి తెల్ల
    బోయె నందున శ్వేతరూపుడు జనించె మూడవది సంతసిలి కాంచె ముద్దుకొమురు.158