ప్ర థ మ స్కం ధ ము.
99
క. నారదు నుపదేశంబున | ధీరమ్యుం డతఁడు జ్ఞాన దీప్తిం గని సం
సారంబు విడిచి ముక్తివి | చారంబున రజతగిరికి జయ్యన నేగెన్.715
ఉత్సాహ. వెండికొండ శిఖరమందు విడిసి ధ్యాననిష్ఠమై
నుండి సిద్దిఁ బడసి పడియె బండజారినట్లుగా
నిండు వెలుఁగు మీర నింగి నిలచి వేఱొ కర్కుఁ డీ
తం డనంగ మిగులఁ జెలగె దైవభక్తి యుక్తుఁడై.716
చ. సుతవిరహాకులుండగుచు శోకమునం గడు దీనుడై యెదన్
ధృతిచెడి వ్యాసుఁ డోరి కులదీపక యేర యొహో కుమార నా
బ్రతివచనంబు భూతములె పల్కును రాజతశైలకూట మం
దతిమధురంబుగాఁగ మును లందఱు నచ్చెరు వంది చూడఁగన్.717
వ. అని యిట్లు విలపింప.718
ఉ. అంతట శూలి పుత్త్రవిరహానల బాధితు వ్యాసుఁజూచి ధీ
మంతుఁడు నీ కుమారుఁడు సమంచితయోగవిదుండు సుమ్ము బ
ల్వంతలఁ గుందనేటికి భవప్రభవానల దూరుఁడయ్యె దు
ర్దాంతత నుత్తమోత్తమపథమ్మున నుండె నటంచుఁ బల్కినన్.719
తే.గీ. దుఃఖమెటులఁ దీరునో తోఁపదిపుడు కనులు దనియవు పుత్త్రలాలనమునందు
ననిన వ్యాసునిఁగనుఁగొని యభవుఁడు నగి ప్రక్క శుకునీడఁ గనుఁగొంచు బ్రతుకు మనిన.720
ఆ.వె. తనదు ప్రక్కఁదోఁచు దనయుని నీడను మిగుల వెలుఁగు గలిగి మెఱయు వానిఁ
జూచి సంతసింప శూలధరుఁడు తన వగపుదీర్చి చనిన వ్యాసుఁ డరిగె.721
వ. అని సూతుండు పరమానందసమేతుండై వచియించిన యుదంతంబంతయు విని విస్మితులై
శౌనకాది మహర్షు లిట్లనిరి.722
మాలిని. శుకుఁడు పరమసిద్దిన్ జొప్పడన్ నిత్యచింతా
వికలమయిన చిత్తోద్వృత్తి వ్యాసుండు దానె
ట్లకట బ్రతుకఁ గల్గెన్ హా యతం డేమిసేసెన్
సకలమును వచింపన్ జాలు దీ వంచుఁ బల్కన్.723
వ. సూతుండు విని తదనంతరంబ వ్యాసువృత్తాంతంబు 'సెప్పెద వినుండు. వ్యాసునొద్ద వేద
వేదాంగంబు లధ్యయనంబు సేయుచున్న శిష్యులు అసితుండును, దేవలుండును,
వైశంపాయనుండును, జైమినియు, సుమన్తుండును విద్యాతపోనిధులై వ్యాసు ననుజ్ఞవడసి
యంతకమున్న దేశాంతరగతులై యుంటంబట్టి చింతాక్రాంతచిత్తుండై తానును
దేశాటనోన్ముఖుండై.724