ప్ర థ మ స్కం ధ ము.
79
క. తుదకు గురుక్షేత్రంబున | సుదతీమణి దిరుగుచుండఁ జూచి సృపతి స
మ్మదమున నోసీ యూర్వసి | యిది తగునా నన్ను విడిచి యిటు చనుదేరన్. 487
మత్తకోకిల. ఓసియోసి పిసాసి యూర్వసి యండు ముండుము న న్నిటుల్
బాసి వచ్చితి వేమిచేసితిఁ బాప మెంతటి దానవే
యాసచే జగమంతయున్ దిరుగాడితిన్ నినుఁ గాంచితిన్
భాసురాంగి ననుం గృపారసవార్థి దేలిచి యేలవే. 488
వ. అనిన విని యూర్వసి యిట్లనియె.489
ఉ. వెంగలి వైతి వేమి పృథివీవర చంద్రమ! నీ యుదారధీ
సంగతి గోఁరఁ గూలెనె విచారవిహీనుఁడవై కళింగ వం
గాంగకురుప్రదేశముల నారట న న్నరయంగ వచ్చితే
యంగన దొంగ నమ్మఁదగదంచు దలంపుము పొమ్ము వీటికిన్.490
వ . అనవుడు. 491
తే.గీ. అహహ స్వైరిణి స్నేహమిం తాయె ననుచు | నరవరుండేగె నాత్మీయనగరమునకు
నని శ్రుతు ల్పల్కు నిది సంగ్రహంబుచేసి | చెప్పితినటంచు సూతుఁడు చెప్పె మఱియు. 492
-: శుకోత్పత్తి :-
సీ. మునులార వినుఁ డిట్లు మును వ్యాసుఁ డాఘృతాచినిఁ గూడుట యయుక్త మనుచుఁ గొంత
వడి చింతపడి తొట్రుపడి క్రిందఁబడి ఱిచ్చపడి లేచి పలుపాట్లు బడఁగమౌని
యకట శపించునో యని భయభ్రాంతయై ముగుద రాచిల్క రూపునను వెడలి
పాఱంగఁ జూచి యప్పారాశరి యనంగరంగుఁడై మైఁగ్రొత్త రంగు పుట్ట
తే.గీ. మనసు గుఱ్ఱంబు కళ్లెంబు మఱియు మఱియు | నెంతలాగిన నిలువక గంతులిడిన
నగ్నికై మంథనము సేయు నరణియందు | నా తపసిరాయనికి శుక్రపాత మయ్యె.493
వ. అనవుడు.494
సీ. భవము దుఃఖైకహేతువటంచుఁ జాటెడి | గతిఁ జిట్టి రొదఁ గావు కావుమనుచు
కల్ల సంసారంబు నొల్ల నొల్ల నటన్న | కరణిఁ గా ల్సేతులు కదపికొనుచు
నిరత తపో ధ్యాన నిష్ట నిల్చెద నన్న | మేల్మి మూసిన ఱెప్ప మెఱమికొనుచు
భూతంబు లూడిగంబులు సేయుఁ దనకన్న | పరుసున నేలపైఁ బొరలికొనుచు
తే.గీ. వ్యాసుఁబోలినవాఁడు పావనుడు దివ్య | మూర్తిగలవాడు చిక్కని మోమువాడు
భవ్య తేజంబువాఁడు పాపరహితుండు | ముద్దుబాలుం డొకండు సముద్భవించె.495