పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మ స్కం ధ ము.

75


శా. ఔరా వీఁ డెవఁడో మహోన్నతభుజుం డాజానుబాహుండు శృం
    గారశ్రీ సుకుమారమారుఁడు కటాక్ష భ్రాంత సీమంతినీ
    వారుం డింద్రకుమారుడో మఱి సుధావాసుండొ యేమందు నీ
    ధీరోదాత్తుని గూడకున్నఁ దగునే స్త్రీత్వంబు నా కియ్యెడన్. 446

వ. అని చింతించుచున్న మత్తకాశిని యెదుటికిం జనుదెంచి ధరావరుండు.447

క. మదిరాక్షి నీదు పే రె | య్యది నినుఁ గడుపారఁ గన్న యతఁ డెవ్వడు నీ
   మది నేమి కోరి యిచ్చట | ముదమున విహరించెదొ సమూలము సెపుమా.448

వ. అనిన నజ్జననాథు పలుకులు విని సిగ్గున నవనతవదనయై మనంబున సందడించు మద
   నుండు ప్రేరేప నెట్టకేలకు ధైర్యంబుగొని యో జనవరా యిటు వినుమని నవలా యిట్లనియె.449

క. ఇళ యందురు నన్నీ భూ | వలయంబున మిగిలినట్టి వార్త లికేలా
   కలయం గోరెద నిను నే | వలరాయని పోరు మాన్పు వసుధాధీశా.450

వ. ఇట్లాడిన ముద్దులాడిం గని యత్యాదరంబున గాంధర్వపద్ధతి నవలంబించి మనోభవ
   మనోహరక్రియాకలాపంబుల నలరించిన సద్యోగర్భంబున నయ్యింతి కొక సుందరుండైన నందనుం
   డుదయించి దినదిన ప్రవర్దమానుండై యలరుచుండె నంత.451

క. వనమంద యుండి యొకనాఁ | డనఘుఁ గులాచార్యు గురువు నాత్మఁ దలంపన్
   జనుదెంచి కార్యమడిగిన | ననియె నిళాకన్య యతని కతి హర్షమునన్.452

క. మీ దివ్యజ్ఞాన మహిమ | నాదు విచారంబుఁ దెలియ నాథులకారే
   సాదరత నడిగితిరిగా | కేదని సుద్యుమ్నవిభుఁడ నిళనైతిఁగదా.453

క. అది విని యంత బృహస్పతి | మది నంతయుఁ దెలిసి త్రిపురమర్దనుఁ జర్మ
   చ్ఛదు శంకరు గిరీశుఁ బదింబది దాఁ దలపోయ నతఁడు ప్రత్యక్షగతిన్.454

సీ. విన్నుముట్టిన కెంపు వన్నెకపర్దంపు జడలలో నెలవంక జగ్గులీన
   గౌరీపరీరంభ కరముద్రికలఁ గాలకూటనీలచ్ఛాయ కొమరు మిగుల
   భూతిభూషితకరాంబుజముల మణికట్ల భుజగఫణామణు ల్పొలుపుమీఱ
   శారదాభ్రముఁబోని చరమగాత్రమునంటి పులితోలు దుశ్శాలు చెలువుగులుక

తే.గీ. తనువు వామార్థమున దక్షతనయ దనర | మూడుకన్నులుసొబగు మోమున నెసంగ
   సలలితస్థితి గంగ యౌదలను బొంగ | నంగజారాతి ప్రత్యక్ష మయ్యె నపుడు.455

వ. ఇట్లు ప్రత్యక్షంబై. 456

ఆ.వె. విన్నవింపు వాంఛ విబుధలోకాచార్య | యన్ననతఁడు నలరి యభవ నాదు
   శిష్యుఁ బురుషుఁ జేసి స్త్రీత్వమ్ముఁ దొలఁగింపు మనిన గిరిశుఁ డిట్టు లనియె నపుడు.457