పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మ స్కం ధ ము.

73

క. కొంద ఱమాత్యులు తనతోఁ బొందుగ రా శరశరాసములు పూని మహా
   నందమున నరణ్యంబుల | యం దుఱులును వలలు పన్ని యయ్యై యెడలన్.430

క. రురువులఁ గుందేళ్ళను సూ | కరముల ఖడ్గములఁ బులుల గవయముల మహా
   శరభంబుల మహిషంబుల | నురుతర వన కుక్కుటముల నోలి వధించెన్.431

వ. అంత నొక్కయెడ నమ్మహీపాలుండు.432

సీ. సాల తాల తమాల సాల తక్కోల రసాల తనుచ్ఛాయఁ దాళి తాళి
    కుంద నాగ మధూక చంద నాగరు గంధ కంద నానాగతుల్ కడచి కడచి
    మల్లికా మాలతీ వల్లికాది లతామతల్లికావళులను దాటి దాటి
    శుకరాజి పలుకు హంసకరాజిత పదంబు పికరాజు స్వరము కన్పెట్టి పెట్టి

తే.గీ. తుమ్మెదల రొద పొదలను దూఱి తూఱి | కుసుమవిసరంబు కొనగోళ్ళఁ గోసి కోసి
    తనర సుద్యుమ్నుఁడు కుమారివనమునందు | గుఱ్ఱ మెక్కిచరించె నెక్కుడగు బ్రీతి.433

ఉ. గుఱ్ఱము గోడిగాయె నృపకుంజరుఁ డత్తఱి నాఁడుదాయె రా
    కుఱ్ఱడు దన్నుఁదాను గని కోమలి నైతి నిదేమి చిత్రమో
    వెఱ్ఱితనాన నిట్టి యడివిం దమి దూఱితి నవ్వుఁబాటు నా
    మొఱ్ఱల నాలకించి కతమున్ వినిపించెడివార లేరోకో.434
  
వ. అనిన విని శౌనకాది మహామునులు పరమాశ్చర్యంబు నొంది యో మహానుభావా!
    సుద్యుమ్నుండు కుమారవనంబు బ్రవేశించి నంతటన స్త్రీత్వంబు సంభవించుటకుఁ
    గారణంబు సెప్పి మమ్మనుగ్రహింపవే యనుఁడు సూతుఁ డిట్లనియె. 435

-: సు ద్యు మ్నో పా ఖ్యా న ము. :-



చ. వినుఁడు మునీంద్రులార మును విన్సిగదేవరఁ జూడఁ దాపసుల్
    సనక సనందనాదులు లసద్ద్యుతులం దిశ లెల్లఁ గప్పుచున్
    జని వనినున్న యా శివుని జూడఁ గనుంగొను నప్డు గౌరి, నా
    థుని తొడమీద నగ్నయయి తుందుడుకుల్ పచరింపుచుండఁగన్.436

ఉ. వారినిఁ జూచి సిగ్గుపడి వైళమ యీశ్వరు నంకసీమ న
    గ్గౌరి తొలంగి వస్త్రమును గట్టి వడంకుచు నిల్చిన న్మనో
    జారిని మ్రొక్కి మౌనులు వెసన్ జన నాతఁడు లజ్జఁ గుందుఁ గౌ
    మారినిఁ గాంచి నీకు ననుమానము లేదు సుఖంబు గూర్చెదన్.437

ఉ. చూడుము నేఁడు మున్నుగఁ గృశోదరి యీ వనమందు జొచ్చు నె
    వ్వాఁడయిన న్వెలంది యగు వాడఁగఁజేసె దిఁకేల మోము నీ