పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

62] వే ము ల వా డ భీ ము క వి 245 మా (డుగడియలకు మొనసీ యత్తిన గండి పగులఁ దిట్టినకవిభానుకంటె నరిజాము లోపలఁ జెఱువు నీళ్లింకంగఁ దిట్టినబడబాగ్ని భట్టుకంటె నుగ్రకోపి నేనునొప్పుదు శపియాంపఁ గ్రమ్మలకింప శక్తిగలదు నాకు వట్టివ్రూనఁ జిగురుపుట్టింప గిట్టింప బిరుద"వేములాడ భీమకవిని," అని పత్యుత్తరమిచ్చెననియు, నందుమి"ఁదట పందిరి_స్తంభమును వృక్షమును గావింపుమని యాతఁడడి గె ననియు నొక కథ కలదు కాని యు ది నమ్మఁదగినది కాదు, ఈ పద్యము భీమకవికృతము కాదు. మహా కవియయిన భీమకవి ' వేములవాడ" యని ప్రయోగించి యుండఁడు, శ్రీనాథుఁడు వేములవాడ భీమకవిని బొగడియుండుటచే భీమకవి శ్రీనా థునకుఁ బూర్వఁడనుట నిశ్చయముకదా! పైసీసపద్యములోని మేధావి భట్టును బ్రౌఢకవి మల్లనయు శీనాథునకుఁదరువాతివారు. మేధావిభజ్జు ಈ°ಟೆ ಪಟ್ಟನು భూమిపైఁబడునుని తిట్టిన పద్యమిది: క, సాళువ పెదతిమ్మమహీ పాలవరుఁడు వీఁడె వచ్చెఁబద్యము వ్రాయన్ గేలను లే దాకొక్కటి తాళము ముత్తునియలగుచు ధర పైబడుమా! ఈ పెదతిమ్మభూలుఁడు పదునైదనశతాబ్దియందలివాఁడు ప్రొఢకవి మల్లన బ్రహ్యదండి చెట్టన మళ్లు డుల్లునట్టు రచించిన పద్యమిది: క, గుడియాన్న నృపతిఁ బొడఁ గన నడువం"గాఁ గొండవల్లి నగరిపడవుటకా