Jump to content

పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

15] దొమెరల వెంగళ భూపాలుఁడు 57 దనయినాగి సురభిచందమున వర్తి లుటనో సుమనోమనొహరస్ఫురణ మించు నను చు జను లను దినమును వినుతిసేయు రాయసింహాసనసముద్ధరణధురీణ જૈષ્ટ దామర్ల వేంకటకి తిత్రలేంద్రు తన యుc డైనట్టి చెన్న భూధవుఁడు వెలయు ఇందలి గడికోట గ్రడపవుండలమున రాయచూ ట్రి తాలూకాలో రా యా వూరి శ్రీకి కీశాన్యమున ౧- మైళ్లలో నున్నది. ఈతని రాజధాని యైన వేలూరు ఉత్తరార్కాడు మండలమున నిప్పడు రాయ వెల్లూ రని యనుచున్న గావు మైయుండును. పై పద్యములోఁ జెన్నభూపతిని "రాయసింహాసన సముద్ధరణ ధురీణు'డని చెప్పియుండుటచే నీతఁడు కృష్ణదేవరాయలకుఁ బిమ్మట గర్ణాట రాజ్యమును బరిపాలించిన యొక రాయలకు సామంతుఁడు 7గానో దండనాయకుఁడు గానొ యుండి యుద్ధములలో బాల్గొనినటూ హింపఁదగియున్నది. ఈ రాయలు సదాశివగాయలై యుండును. పథమాశ్వాసాంతపద్యములోఁ •ృతిపతిని “నిజామశ హైదు ల శాకుతుపశాహసమాగత హాటక ఘాటక రూటకరిపవరా" అని సంబోధించియుండుటచేఁ గవితండ్రియైన వెంకటాది కులీకుతుబ్దా కాల ములో నున్నవాఁడు. కావునఁ గవి క్రీ. శ. ౧XXం-౧X_ం నడుము నున్నవాఁడని బహులాశ్వచరిత్రపీఠికాకారులు వాసియున్నారు, వెలు R* శ్రీః కస్తూరిరంగభూపతిని బట్టియు నాతని తనయుఁడైన బంగారు యాచభూపతి ననసరించియు నీ కాలము సరియయినదని ధువపడు చున్నది. కవి కన్నగారైన చెన్నభూపతి వెలుగోటి కస్తూరి రంగనా యని కల్లుఁడు. బంగారు యాచమనాయని సోదరీభర్త ఈతనిని గూర్చి దామెర్ల అంకభూపాలుని చారిత్రమున వ్రాయుదును. వెంగళ భూపాలునకు రెండవయన్నగారైన కేశవనాయని శాసన మొకటి