పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8ఆంధ్ర కవి తరంగిణి


కది సముద్రతీర మేవెూ! నెల్లూరు నల్లూరయినచో దానిని కాల్పట్టణమైయేనేమో ఇవన్నియు నూహలు.

—: శ్రీ నా థుఁ డు క న డుడా :---

ఈ వాదము లిల్లుండఁగా సీతని జన్మస్థానము కర్ణాటక దేశమని యు, సేతఁడు కన్నడుఁడనియు నొక వాదము బయలు దేరినది అట్లు! వాదించువారికి భీముపురాణ ముందలి ‘ఎవ్వరేమన్న నండ్రు గాకేల కొఱఁత నాకవిత్వంబు విజ:ము కర్ణాటభాష” అనుపద్యపాదమును, కాశీఖండమందలి కర్ణాట చేశకటక పద్మవన హేళి శీనాధభట్టకవిని” అనుపద్యపాదమును, గర్ణాట ప్రభువగు దేవరాయలను జూడఁ బోయి నప్ప డెన్నాళ్ళకును దర్శనము గాక పోగా:--

శా.కుల్లాయుంచితిఁ గోక సుట్టేతి మహాకూర్పాసమున్ గొడ్గితిన్ వెల్లుల్లిన్ దిలపిష్ట మున్ మెసవితిన్ శ్రీన్ విశ్వ స్త వడ్డింపపఁగాఁ

జిల్లా ( ) యం.బలిఁ దావితిన్ రుచులు దోసం బంచుఁబోనాడితిన్ తల్లీ కన్నడ రాజ్యలక్ష్మీ! దయ లేదా ! నేను శ్రీనాథుండన్

అని శీనాథుఁగు చెప్పిన చాటువునందలి తుది పాదమును నా భారములు. ఈ వాదమునoదు స్వారస్యము లేదు. కర్ణాటక దేశమున సము దతీర్చ స్థమైన కాల్పట్టణమును వారు చూపుట లేదు. కర్ణాటక చేశము న కేఁగి నప్పడు కన్నడ రాజ్యలక్ష్మీని ‘' తల్లీ యని సంబోధించినంతమాత్ర మున నాతనిది కర్ణాటకమని నిర్ణయింపరాదు. వెలనాఁటిక వియో, పాకనాఁటిపండితుఁడో కర్ణాటక మొనకుఁ బోయి కర్ణాటక రాజ్యమును తల్లీ యని సంబోధింపఁ గూడ దా! శీనాథుఁడు రచించిన గంథము లస్నియు నాంద్రమునందుండగా; "హర్షనైషధ కావ్యమా ధ్ర భాష' కాళికాఖండమును మహా గ్రంథ మేను దెనుఁగుఁ జేసెద’ ‘శివపురా ణంబు తెనుంగుఁగా చేయు మొకటి' అని తన గ్రంథము లాం ధ్రమని తెలుఁగని శీనాథుడే చెప్పియుండగా; “నాకవిత్వంబు కర్ణాట భామ"యని యేదియో సందర్భమునఁ జెప్పి మాటనబట్టి యాతినిని గన్నడుఁ డనియనుట హాస్యాస్పదము.