పుట:శ్రీసూర్య శతకము.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తా. మేరుపర్వతోపాంతముల దేవతలు గిరియందు వంగి నమస్కారమలు చేయగా, కిన్నరీకన్యలు సిగ్గుతో గుహాద్వారములనిల్చి చూచుచుండగా, సారథి కళ్లెములు లాగుచుండినను, మెల్లమెల్లగా నడచు రవి హయములు మీకౌలల నడందుత.(48)

ఉ. తమ రుచిచేతఁ బచ్చనగు తట్లమొగుళ్లను ఱెక్కలొప్పఁ గ
ళ్ళెములను లాగ నెత్తురులు లేచిన నోళ్ళను ముక్కు లొప్ప వ్యో
మముననుఁ దుఱ్ఱు మంచు వడిఁ బాఱు సుమేరుశిఖాగచారి కీ
రము లన నొప్పు సూర్యునిగుఱాలు వరాల సరాలు మీకిడున్.

తా.ఆకుపచ్చనైన తమ శరీరకాంతిచే తెల్లనగు మేరు పర్వతపు చరియలను పచ్చదనము కలిగినట్లు చేసి, మేఘములను రెక్కలతో కళ్లెములు లాగుటవలన నోటినుండి వచ్చు రక్తము నెఱ్ఱదనముతో మేరు శిఖరాగ్రమున చిలుకలవలె తుఱ్ఱుమని పాటు సూర్యాశ్వములు మీకు శ్రేయము లొసగుత.(49)

అనూరు వర్ణనము

చ. పొడుపుడుగొండ రంగమునఁ బొంకపు రేతేఱచొత్త లక్ష్మిక
న్పడ నుడుపంక్తి పేరిటి నవంబగు పూవుల దోయిలింత జొ
ప్పడ నిడి సూత్రధారత దివంబున నాలుగు జాల యంకముల్
నడపెడి లోకనాటిక ననం జను నయ్యరుణుండు మీ కగున్.

తా. తూర్పుకొండ అను రంగస్థలమున రాత్రి యనెడి తెర తొలగగా, నచ్చటచ్చట నున్న నక్షత్రములు పుష్పాంజలిగా, నాలుగు జాములనెడి నాలుగంకముల జగన్నాటకము ప్రారంభించు సూత్రధారుడైన అరుణుడు మీకు శుభంబు లిడుగాత.(50)

చ. హరులకు నగ్ర్యుఁ డన్, హరిన యాతఁడు మోచుఁ బళు క్రియం జరా
చర సమభావకర్మతతి సాక్షిని యాతఁడు పక్షపాత సం
చరణుఁ డటంచు నీడునను సామ్యము నొందియు దృక్రుతి ద్విషున్
దరిమెడి నేమ ధామములధామమనూరుఁడు వాపు మీ కొలల్.