పుట:శ్రీసూర్య శతకము.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూర్య శతకము

కిరణ వర్ణనము

శా.జేజేరాయని కుంభికుంభగతమౌ సిందూరముల్ తాల్చియో
యోజం జేగురువాగు లయ్యుదయశై లో పొంతమం దంటియో
రాజీపప్రభ లేకకాలమునఁ బ్రారంభించియో యెఱ్ఱనై
తేజుల్ చిమ్ము నవార్కభాను లిడు నెంతే మీకు నైశ్వర్యముల్.

తా. తూర్పు దిక్కున కధిపతియగు నింద్రుని యైరావత కుంభములకు పూసిన సిందూరము వలెను, ఉదయ పర్వతము నుండి కారుచున్న జేగురు ధారల రీతిని, తామరపూవుల నూతన కాంతిని ఎఱ్ఱనైన సూర్యకిరణములు మీకు సిరులు నొసగు గాత.[1]

ఉ. తామర మొగ్గ పెన్గొఱఁడుఁ దప్పని లక్ష్మిని భక్తకోటికిన్
బ్రేమ నొసంగు లాగఁ దలపెట్టియొ తద్వని ముట్టడించుచున్
భీమతమంబునం దగిలి భీతిలు లోకముఁ బ్రోవ జాణలౌ
కోమల పల్లవాభ రవిగోనిచయంబులు మీకు మే లిడున్.

తా. ముకుళించుకొని యున్న తామర మొగ్గలలోని లక్ష్మిని లోకమున కందించు తలంపున కటిక చీకటిని చీల్చుచు, ఆ లక్ష్మిని మానవుల కందించుచు, కోమలములై ఎఱ్ఱనైన చిగురుల బోలిన సూర్యప్రభలు మీకు శోభనము లొనగూర్చు గాత.[2]

ఉ. కోమలపద్మగర్భములఁ గొండల శాతశిఖాళి నొక్క మై
మైమును ప్రొద్దుజోల మునుమాపుల వ్రాలి యొకించుకోని వి
శ్రామము లేక ముజ్జగముశాల నటించి సదా పథశ్రమో
ద్దామత నా, మహోష్ణిమము దాల్చు రవిప్రభ లేలు మిమ్ములన్.