భూదేవియు విద్యుల్లతాసంకాశ యై ప్రకాశించి కరంబునం
గరంబు మెఱయు శ్వేతకమలంబు ధరించిన శ్రీదేవియుఁ
గమలకర్ణికాసన్నిభయై దీపించు వామకరంబున శోణాంబు
జంబుఁ దాల్చిననీళాదేవియు హరిం జేరి ఛత్రచామరం
బులు వట్టిన సుందరీమణులు గొలుచుచుండుసమయం
బున శ్రీనివాసుండు కరుణాకటాక్షవీక్షణుండై బ్రహ్మేంద్రా
దులకుఁ బ్రత్యక్షంబయ్యె. నప్పుడు కమలగర్భాధ్యగ
స్త్యవసిష్ఠమహామునులును సనకసనందనాదిమహాయోగు
లును బురుహూతాది గీర్వాణులును శ్రీహరికిం బునః పునః
ప్రణామంబు లొనర్చి పులకాంకితశరీరులై సంపూర్ణానందం
బున గద్గదకంఠులై బాష్పపూరితాక్షులై కరంబులు
మొగిడ్చి యిట్లు నుతించిరి.