పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

87


తే.

దశరథుఁడు లేచి వెఱగంది ధాతృముఖ్య
దేవతాళికి మునులకు భావ మలర
మ్రొక్కె నప్పుడు వా రెల్ల మొనసి నీకు
వంశ మభివృద్ధి యగునని వర మొసంగి.

47


వ.

దశరథుని దీవించిరి యనంతరంబు.

48


క.

ఆకాశంబునఁ బొడమిన
భీకరశబ్దంబు చెవుల భేదించిన దిం
దీకాల మభ్రఘోషం
బీకరణిం బుట్టఁదగిన హేతువదేమో.

49


క.

అని యందఱు గగనదిశం
గనుచుండ ననేకు లయిన కమలాప్తులు గూ
డి నయట్టుల దేజంబుగఁ
గనుపించెం దానిఁ జూడఁగాఁ జిత్రముగన్.

50


క.

జ్వలన గ్రహ నక్షత్రము
లలఘుతటిల్లత లనేకు లగు చంద్రులతోఁ
గలసిన గతి నమిత ద్యుతి
విలసితముగ నభము నిండె విస్మయ మారన్.

51


క.

ఎక్కడఁ జూచిన కాంతులు
క్రిక్కిఱిసినఁ జూడలేక గీర్వాణముఖుల్
చొక్కుచుఁ గన్నులు మూసిరి
నిక్కము దెలియంగ రాక నెఱి నామీదన్.

52


సీ.

అప్పుడు కోటిసహస్రమార్తాండప్ర
        భానిభంబైన విమాన మొండు