పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

86

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


సేయుచున్నాఁడు గావున శ్రీశుఁ డింక
నమరవరునకుఁ బ్రత్యక్ష మగుట నిజము.

42


వ.

మఱి యేను భవదీయపురోహితుండ నగుటం జేసి యిచ్చటి
కేతెంచితిఁ గావున.

43


తే.

ధన్యుఁ డగు సర్వలోకపితామహుండు
భక్తి మెఱయనివాతదీపంబు వోలెఁ
దాఁ జలింపకయున్నాఁడు దనర నజుని
మెచ్చి ప్రత్యక్షమగును లక్ష్మీవిభుండు.

44


ఉ.

కావున దివ్యపుష్కరిణి కామఫలప్రదయంచు నమ్మి యో
భూవర నీవు త్వరగఁ బుష్కరిణీజలమందుఁ గ్రుంకి స
త్పావన భక్తి మీఱఁగ జపం బొనరించుమటన్న నప్డు ధా
త్రీవిభుఁ డిట్లనెం బరమదేశిక తజ్జపమీవు చెప్పవే.

45


సీ.

అనిన శ్రీవేంకటేశాష్టాక్షరీమంత్ర
        మావసిష్ణుండు పుత్రార్థియైన
దశరథేశ్వరునకు దయ నుపదేశంబు
        సేయఁగా నృపతి వసిష్ఠమునిని
బూజించి కూర్చుండి పుత్రార్థియై మహా
        శిష్టుఁ డై జపమును జేయుచుండె
నపుడు వసిష్ఠుఁ డత్యంతనిర్మలచిత్తుఁ
        డగుచు నొక్కెడఁ దపం బాచరించు


తే.

చుండె నంత నభంబున నుఱిమినట్ల
కడుభయంకర నినదంబు గల్గె నాస్వ
నంబునకు బ్రహ్మ తనశరీరంబుఁ దెలిసి
కనుల నలువంకలం గనుంగొనుచు నుండ.

46