పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

74

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


నారీతిఁ దెల్పు నీవని మును లడుగఁగా
        నాసూతుఁ డనియె నావ్యాసమౌని
చెప్పినకథ మీకుఁ జెప్పెద నెట్లన్న
        సనకాదియోగుల శాప మంటి


తే.

జయుఁడు విజయుండు దితియందు జనన మొంది
కనకలోచనుఁడును హేమకశిపుఁ డనఁగ
ధరణిపైఁ బుట్టి సాధు బాధల నొనర్ప
సరగఁ గిటియై హిరణ్యలోచనుని ద్రుంచి.

4


ఆ.

అపుడు స్వర్ణకశిపుఁ డాగ్రహంబును మించి
సాధు భక్తులకును బాధ చేసె
నందుచే నృసింహుడై చక్రి యాదైత్యుఁ
గడుపుఁ జించి చంపెఁ బుడమిఁ బడఁగ.

5


సీ.

పరమభక్తుం డైన ప్రహ్లాదు రక్షించె
        నటు లేగి కనకాక్షుఁ డాహిరణ్య
కశిపుఁడు మఱి కొంతకాలంబునకుఁ గుంభ
        కర్ణ రావణు లనఁగా జనించి
రామచంద్రునిచేత భూమిపైఁ బడుదాక
        బాధించుచుండిరి సాధువులను
గావున శక్రుఁడు దేవర్షు లెల్లరు
        నా రావణునిదుర్గుణాళి హరికి


తే.

మనవి చేసెదమని పోయి ఘనసుధాబ్ధి
తీరమును జేరి పలికి రో దేవదేవ
రావణునిబాధ తప్పించి నీవు మమ్ము
బాలనము సేయు నోమహాపరమపురుష.

6