పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

71


వరాహపురాణంబునందు వేంకటగిరిపురవర్ణనంబును, నైమి
శారణ్యవర్ణనంబును, శౌనకాది మహామునుల ప్రశ్నలును,
బ్రహ్మ దినప్రళయ ప్రకారంబుసు, హరి శ్వేతవరాహంబై
హిరణ్యాక్షుని సంహరించి రసాలగతయగుభూమిని యథా
స్థానంబునం దుంచుటయు, వరాహస్వామి యనుమతంబున
శ్రీభూనీళలతోడ వైకుంఠమునం దున్నక్రీడాద్రిని గరుత్మం
తుండు గొనివచ్చి భూలోకమునందు నిల్పుటయు, బ్రహ్మేం
ద్రాదులు వచ్చి స్వామికి మ్రొక్కి వినుతించుటయును,
వరాహస్వామి శేషాద్రియందు విహరించుటయును, పుష్క
రిణీ మాహాత్మ్యంబును, వేంకటాద్రికి నొక్కొక్కనిమిత్తం
బున నొక్కొక్కనామంబు గల్గుటయు, వరాహస్వామి
క్రీడానగంబునకు నుత్తరదిగ్భాగంబున విహరించు చుండి
విటవేషధరుఁడై మౌనుల యజ్ఞశాలయందుఁ బ్రవేశించి
వపాగ్రహణంబు సేయుటయు, దేశాంతరగతుం డైన వృద్ధ
బ్రాహ్మణుని హరి కటాక్షించి కుమారధారాఖ్య తీర్థంబున
స్నానంబు సేయించి బాలకుమారునిగాఁ జేసి పంపుటయు,
శంఖణమహారాజునకుఁ బుష్కరిణియందుఁ బ్రత్యక్షంబయి
రక్షించుటయు, నాత్మారాముఁ డనుబ్రాహ్మణునకు హరి ప్రస
న్నుండై సమస్తైశ్వర్యంబుల నిచ్చుటయు, కపిలలింగ కపిలతీర్థ
సంభవంబులును, దత్కపిల తీర్థాది సప్తదశ తీర్థప్రభావంబు
లును, తీర్థయాత్రపోవు విప్రునకు స్వప్నమునందు హరి
ప్రసన్నుండై పుష్కరాద్రియందుఁ గల తీర్థంబులఁ జూపు
టయు, ధర్మరాజాదు లొక్కసంవత్సరము వేంకటాద్రియం