పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

51


వ.

అని వచించి యంగన్యాసాదిపూర్వకంబుగ లక్ష్మీమంత్రం
బుపదేశించి ధ్యానంబు సాంగంబుగఁ జెప్పి శ్రీహరి భవదీయా
భీష్టం బొసంగు వేంకటాచలంబున కరుగు మని యానతిచ్చె,
నంత నాత్మారాముం డానందబాష్పకలితనేత్రుం డై తద్గు
రుధ్యానంబు చేసి లక్ష్మీమంత్రంబు జపంబుసేయుచు నాకాశ
గంగ భూమికి దిగివచ్చు చందంబున విరజానదికైవడిఁ బరమ
పావనంబు లైన తీర్థంబులు శైలాగ్రంబుల నుండి ప్రవహిం
చుచు భూమికి దిగివచ్చుచుండుటఁ జూచి సంతసించుచుఁ
గృతస్నానుం డై పర్వతారోహణంబు చేసి స్వామిపుష్క
రిణియందు నఘచయంబు తలంగ స్నానం బొనర్చి హరిధ్యా
నంబు చేయుచున్న సమయంబున.

180


సీ.

ప్రాకారపంక్తులు బహుమంటపంబులు
        వివిధోరుకల్యాణవేదికలును
సదమలతప్తకాంచననిర్మితంబు లై
        కొమరారుచున్నట్టి గోపురములు
వరనీలమౌక్తికవ్రజచప్పరంబులు
        రమణసౌధాట్టాలకములు బాల
భానుకోటిప్రభాభాసమానసురత్న
        సహితంబు లగుసభా స్తంభములును


తే.

గలిగి గంధర్వనగరసంకాశ మగుచు
విధిశివేంద్రాదిసిద్ధసేవితము నగుచు
గీతనర్తనవాద్యసంకీర్ణ మగుచు
నమరు నొకదివ్యధామమధ్యమున నుండి.

181