పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/489

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

482

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


మ.

నీ వాచక్రిగుణంబులం దలఁపుచున్ నిర్వాణబోధస్థితిన్
భావంబంచు గ్రహించి మా కొనరఁ జెప్పం జాలయోగ్యుండవై
నా వీరీతిని కొంకు లేక యిచట నానాపురాణార్థముల్
ధీవిజ్ఞానుఁడవై వచించితివి సందేహంలం దీర్చుచున్.

230


ఉ.

కావున నీవు ధన్యుఁడవు కంజదళాక్షుఁడు నీహృదబ్జమం
దే వసియించియుండి గణుతింపగ దివ్యతరోక్తులం గృపన్
బ్రోవగ నీ కసాధ్యములు పుట్టవటంచు మునీంద్రు లందఱం
దావిమలాత్ము సూతుసుగుణావళి నెన్న చు నాదరంబునన్.

231


చ.

పలుకఁగ సూతుఁ డిట్లనియెఁ బద్మదళాక్షుఁడు బాదరాయణుం
డల శుకయోగిపుంగవుడు నార్యులునై తగు మీర లందఱున్
విలసితమైన మీకరుణ వేడ్కగ నాయెడ నుంచియుండఁగాఁ
జెలు వలరంగఁ దోఁచినవి చెప్పితినంచు వచించి నమ్రుఁడై.

232


క.

మునులను సన్నుతి చేయఁగ
విన వారలు మెచ్చి యతని వినయానందం
బున కలరుచుఁ గ్రమ్మఱ ని
ట్లని రింకొకఘనరహస్య మడిగెద మనఘా.

233


ఆ.

విను మనేకమర్త్యవితతులలో మోక్ష
కాము లైనవారు కాయములను
విడచి యెచటనెచట విమలులై పొందుదు
రావిధంబు దెల్పు మయ్య సూత.

234


క.

అన విని సూతుం డప్పుడు
తనగురుని మనంబునందుఁ దలఁచి యచలుఁడై