పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/488

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

481


తే.

ఎనుబదియు నొక్కవేలసంఖ్యను ఘనముగ
రచితమౌ స్కాందమనెడు పురాణ మొకటి
వింశతిసహస్రసంఖ్యతో వివిధకర్మ
రాజితాగ్నేయనామపురాణ మొండు.

226


సీ.

వెలయఁగ నిరువదివేలగు సంఖ్యతోఁ
        దనరు మార్కండేయమునిపురాణ
మదిగాక యిరువది యగువేలసంఖ్యను
        సారమై తగు భవిష్యత్పురాణ
మేన్న నెనిమిది పదునెనిమిది యగుపురా
        ణంబులు మీకు నిర్ణయముగాను
జెప్పితి నిదిగాక శ్రీవరాహపురాణ
        మున భవిష్యోత్తరమునను మఱియు


తే.

రమ్యతరమగు పద్మపురాణమునను
వింతలగుచుఁ బ్రకాశించు వేంకటాద్రి
పతిచరితములు గొన్ని యేర్పఱచి మీకు
జెప్పితిని నేను మోక్షంబుఁ జెందుకొఱకు.

227


క.

అని యాసూతుఁడు పలుకఁగ
విని శౌనకముఖ్యమునులు విశ్వాసముతో
గనుఁగొని యతని ముదంబున
వినుతింపుచు నిట్టు లనిరి వేడుక మీఱన్.

228


చ.

సురుచిరభక్తియుక్తులను సూనృతవాక్యము లాత్మనిష్ఠయుం
బరమవివేకశీలములు పావనమోక్షవిచారధర్మముల్
కరుణయు శాంతమున్ మొదలుగాఁగల సద్గుణముల్ దృఢంబుగా
నఱిమురి నిల్చె నీహృదయమం దతిధన్యుడ వైతి విద్ధరన్.

229