పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/486

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

479


మగు చతుర్యుగకాలంబు లవనియందు
సార్వకాలంబు నీరీతి జరుగుచుండు.

220


తే.

భూమిపై నాల్గుయుగములు పుట్టి పుట్టి
వేయుమాఱులు పోయిన విధికి నొక్క
దినమగున్ రాత్రి యట్లగుఁ దెలియ సరవి
ననుచు గుఱుతొండు సూతుండు వినఁగ నుడివి.

221


వ.

మఱియుఁ జతుర్యుగసహస్రంబులు గడచునంతకు బ్రహ్మ సృష్టిం
జేయుచుండు నది గడచిన తుద నిద్రఁ జెందినపుడు లోకంబు
లడంగు నతండు మేల్కాంచినప్పు డన్నియుం బుట్టుచుండు
నిట్టి బ్రహ్మదినంబునం జతుర్దశమనువు లివ్వసుంధరఁ బాలింపు
చుందు రట్టిమనుకాలం బెట్టిదనిన స్వాయంభువాదిమనువుల
కొక్కరొక్కరికి దివ్యయుగంబులు డెబ్బది యొకమాఱు చనిన
నది యొకమనుకాలంబని చెప్ప నొప్పు నొక్కొక్క దేవేం
ద్రుఁడు దేవతలు సప్తఋషులు రాజులు హరియంశంబులను
ధరించి యుదయించి లోకంబులు పాలింతురు నారాయణుండు
దేవతిర్యఙ్మనుష్యరూపంబులు ధరించి సర్వంబును దాన
సమర్థించి రక్షింపుచుండు శ్రీవేంకటేశ్వరుండు మూఁడు
యుగంబులు మునియక్షాదులచేత బూజింపఁబడుచుండి
ప్రతికలియుగంబునందు మనుష్యపూజ లంగీకరించి భక్తుల
రక్షించుచుండు నని చెప్పి వెండియు నిట్లనియె.

222


సీ.

మునివరులార మీ రనఘులు సర్వజ్ఞు
        లగుచు నుండియు నన్ను నడుగగాను
భక్తితో శ్రీవ్యాసభట్టారకులదయ
        విశదంబుగను పదివేలసంఖ్య