పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/474

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

467


క.

భావించుచుఁ గొన్నేండ్లా
శ్రీవనితామణి తపంబు సేయఁగ నపు డీ
శ్రీవేంకటగిరినిలయుం
డావెలఁదిని మెచ్చి తలఁచె నపు డీరీతిన్.

183


సీ.

తనుఁగూర్చి తొలుతన తప మాచరించితి
        నని నన్నుఁ గూర్చి యయ్యాదిలక్ష్మి
పాతాళమందె తపం బాచరించుచు
        నను జిక్కపట్టియున్నది ధరిత్రి
పైకి వచ్చుట కేయుపాయంబు గావింతు
        నని వీరలక్ష్మీహృదబ్జమందు
వెలిగెడితనరూపములను నచ్చట తిరో
        ధాన మొందింపఁగ ధ్యాననిష్ఠఁ


తే.

జలన మొందఁగ నప్పు డాశ్చర్య మొంది
కన్నుఁగవ విప్పి చూచి పంకరుహనాభు
నచటఁ గానక చింతించి యపుడు లేచి
కపిలమునిపాలి కరిగి శ్రీకాంత నిలిచె.

184


క.

అపు డాలక్ష్మిని గనుఁగొని
కపిలమునీంద్రుండు మిగులఁ గరుణం బలికెం
జపలత్వరహిత మగునీ
తప మమలంబై ఫలించెఁ దామరసాక్షీ.

185


క.

ఇఁక నీ విందుండక సని
ప్రకటితశేషాద్రిదిగువఁ బద్మసరసునం
దకుటిలమతివై చేరుము
శుకమునిసుతుఁ డందు నిన్నుఁ జూచి ముదమునన్.

186