పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/470

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

463


శబ్దంబులను జర్మంబువలనం దెలియు స్పర్శంబులను గన్నులవ
లనఁ జూచు రూపంబులను జిహ్వచేత గ్రహించిన రుచులను
ఘ్రాణంబువలన నాఘ్రాణించిన గంధంబులను గర్ణేంద్రియవిష
యంబులైన వచనదానగమనవిసర్జనానందంబులను మనోబుద్ధి
చిత్తాహంకారవిషయంబులైన సంశయనిశ్చయవిచారకర్తృ
త్వంబులను దెలియు నెఱుకయ చిన్మాత్రంబైన స్వస్వరూపం
బగు నింకఁ బరస్వరూపం బెద్దియనిన వ్యష్టిసమష్టిరూపంబు
లైన పిండాం బ్రహ్మాండంబు యందు నేకరూపం బై వ్యష్టి
సమష్టిరూపంబులయందు మేఘమండలమందలి జలము వర్షిం
చిన భూమియందుం గల వాపీకూపతటాకాదులయందు నిలచి
నచందంబున నీశ్వరచైతన్యంబను మేఘజలంబు జరాయుజాం
డజోద్భిజస్వేదజంబు లను జతుర్విధభూతములయందు నిల్చి
యుండుననిన భాస్కరుం డిట్లనియె.

172


తే.

ఆహిరణ్మయతేజ మీయఖిలభూత
వితతులందున నెట్లు ప్రవేశ మగును
మఱల స్వస్థానమున నేక్రమమునఁ జేరు
నాసరణిఁ దెల్పు బాదరాయణకుమార.

173


వ.

అనిన శుకుం డిట్లనియె.

174


సీ.

కమలజాండమును బ్రకాశింపజేయుచు
        రమణీయవిశ్వకారణము నైన
మహితహిరణ్మయమండలం బధికతే .
        జోరసాత్మకమై విశుద్ధ మయ్యె
నందు రసాంశ మాయమృతాంశరూపమౌ
        నది కాలవశమున ననిల మగుచుఁ