పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/469

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

462

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


తే.

నాకుఁ దోఁచినయంత నిర్ణయముగాను
మద్గురునిసత్కటాక్షసన్మహిమచేత
విన్నవించెద మదిని భావించి యంచుఁ
బద్మబాంధవునకు మ్రొక్కి పలికె గరిమ.

171


వ.

నారాయణపరబ్రహ్మంబను చిద్బిందువువలనఁ బ్రణవస్వరూపం
బైన శబ్దంబు పుట్టి నాశబ్దంబువలన బయలైన నభంబునందు
స్పర్శవలన వాయువు పుట్ట నవ్వాయువు గగససంబంధముచేత
నుష్ణరూపంబగు తేజంబు గలిగె నం దగ్ని జనించె నయ్యగ్ని
యధికంబై ప్రకాశించి తనయందు వ్యాపింపఁగ నాబిందువు
రసాత్మకంబగు సారమును మహాజలముగ సృజించి తేజోరూ
పంబగు నప్పరమాత్మ తా నామహాజలమునందు నిలిచె నది
య హిరణ్యమయంబగు తేజంబై కొంతకాలంబునకు నారికేళ
వృక్షంబులు ఫలంబులు నొందుచందంబున ననేకకోటిబ్రహ్మాం
డంబులలో నొక్కొక్కబీజము వృక్షఫలంబులం దనేక
బీజరూపంబై నిల్చినట్టుగ మూలకారణం బైన హిరణ్మయ
తేజస్సు సూర్యరూపంబై స్థావరజంగమాత్మకంబైన జగత్తును
దనరసాంశమువలన జీవమై పోషింపుచును, తేజాంశమువలన
హరింపుచును వటబీజము భూజలసంబంధముచేత వృక్షా
కృతియై వృక్షములో రసరూపమై నిలిచినట్లు హిరణ్మయ
తేజస్సు సప్తద్వీప సప్తసాగర సప్తకులాచలాధారంబైన
బ్రహ్మాండంబుగఁ బరిణమించి సూర్యరూపంబై నిలిచియున్న
యది. ఆ స్వరూపంబు సకలభూతంబులయందును రసరూప
మైన జీవంబగు నారసమునంద తైలవర్తియందు జ్వాల వెల్గి
నట్ల తెలివి వెలుఁగుచుండు నా తెలివియ తన్నును జెవుల వినిన