పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/468

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

461


సీ.

పుణ్యాత్మ నీ వింక భూలోకమున కేగి
        శ్రీవేంకటాద్రి దక్షిణముగాను
ముఖ్యమైన సువర్ణముఖరికి నుత్తర
        తటమున వెల్గు సిద్ధస్థలమున
మహిమ నొప్పు మదాశ్రమంబున నీ వుండు
        మదిగాక శ్రీగంగ కరిగి మాకు
దండ్రియైన వేదవ్యాసముని నన్నుఁ
        బేర్కొన్న నపు డతిప్రేమ మీర


తే.

నీవు నారీతిగా నందు నిలిచి పలికి
చెలఁగి వారికి శుశ్రూష చేసి వారి
యనుమతిం బెండ్లియాడి నందనులఁ గాంచి
కులము నభివృద్ధిసేయుము గొప్ప తనరి.

169


తే.

ఇప్పుడు ముందుగ శ్రీకాశి కేగి యచట
నచలభక్తిని బాదరాయణుని గొన్ని
వత్సరంబులు గొలిచి యవ్వల మదాశ్ర
మస్థలంబునఁ జేరు కుమార యనుచు.

170


సీ.

వానికి నియమించి వసుధకుఁ బంపించి
        పంకజాప్తుని గాంచి పల్కె నిట్లు
మార్తాండ నీకృపామహిమచే సుతుఁ డుద
        యించె నన్నింకఁ బోనిమ్ము మనిన
నగి సూర్యుఁ డిట్లనె నాస్వరూపంబగు
        జీవతత్వం బెద్ది చెప్పు మనిన
శుకుఁ డిట్టు లనె జగజ్జ్యోతిస్వరూప నీ
        చిన్మాత్రసత్తు నేఁ జెప్పఁగలనె