పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/464

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

457


నిన్ను వెదకుచునుండఁగ నీవు నింగి
కెగిరివోవుట పాడిగా దెట్టులనిన.

156


క.

నీ వాశ్రమధర్మములను
బోవిడిచి మహావిరక్తిఁ బొందుట తగునే
దేవర్షి పితౄణంబులఁ
బావనమతి వగుచు దీర్చి పై కరుగు మయా.

157


సీ.

ఆదియం దమరంగ వేదముల్ చదివితి
        వందుచే ఋషిఋణం బపుడ తీఱె
సతి నింకఁ జేఁబట్టి సవనముల్ గావించి
        ధీరుఁడవై దీర్చు దేవఋణము
పుణ్యాత్తు లగునట్టి పుత్త్రకులను గాంచి
        పెంచి గ్రక్కున దీర్చు పితృఋణంబు
కొంకక ఋణవిముక్తుండవై జ్ఞానివై
        మహి విరక్తుండ వై మఱల నిటకు


తే.

వచ్చి నామండలము దాఁటి హెచ్చి పైకిఁ
గ్రమముగాఁ బోయి మీదిలోకములు గడచి
పరమపదమును జెందుమో పరమమౌని
యనినఁ జిఱునవ్వు నవ్వి యిట్లనియె శుకుడు.

158


వ.

నీ వాదిత్యుండవు త్రిమూర్త్యాశకుండవు కర్మసాక్షివి జగచ్చ
క్షుండవు భాస్కరుండవు నీచిత్తంబునకుఁ దెలియనియర్థంబు
లే వైన నామనంబునం దోఁచిన యర్థంబు విన్నవించెద నెట్ల
నిన మాతృగర్భంబు సొచ్చి దేహధారియై భూమియందు
నుదయంచిన దినంబు మొదలుకొని యుదయాస్తమయ
వ్యాజంబునఁ బురుషాయువును గాలంబు వంచించి కొంపోవు