పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/463

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

456

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


వారికి ధన ధాన్యవరసంపదల నిత్తు
        నందున లోభపాపాత్ము లైన
నరులధనంబులు నానాఁట నశియింప
        జేయుదు నది వృద్ధి చేయ ననుచు


తే.

హరికి సమ్మతముగఁ జెప్పి నరుల కెల్ల
సంపదల నిచ్చుచుండె నాసమయమునను
సకలజనములు వేంకటాచలము చేర
వచ్చి ధనరాసు లాస్వామి కిచ్చి మ్రొక్కి.

154


వ.

అదియునుంగాక శ్రీనివాసార్పితంబుగ ననేకబ్రహ్మాదులకు
సకలదానంబులు చేసి యిహపరసౌఖ్యంబు లనుభవింపు
చుండి రాశ్రీనివాసుండు సకలజనుల నెలమి రక్షించుచుండె
నని దేవదర్శనుండు చెప్పిన విని సంతసించి క్రమ్మఱ దేవలుం
డిట్లనియె.

155


సీ.

ఘనదేవదర్శనముని శుకాశ్రమమందుఁ
        దపనీయచేలుండు తపము సేయు
నప్పు డాయోగీంద్రుఁ డందుండెనో లేదొ
        యనిన దేవలున కి ట్లనియె నతఁడు
విను విప్ర హరి తపం బొనరింప కట మున్నె
        బ్రహ్మపదానందభరితుఁ డగుచు
శుకయోగిచంద్రుడు సూర్యమండలమున
        జొరఁబడి పో చూచి సూర్యుఁ డతని


తే.

నిల్పి యిట్లని పల్కె నోనిర్మలాత్మ
నీకు గురుఁడైన వ్యాసుఁ డీలోకమునను