పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/462

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

455


దోడ్కొని వచ్చి వారు దెచ్చిన ధనంబు నీక్షించి పుణ్యపాప
విత్తంబుల నేర్పరించి సుజనదుర్జనులకుఁ బంచిపెట్టించి నాకు
సంతర్పణంబు సేయుండని యాచించి వారిచేత నన్నదానం
బులం జేయింపుచు నందున వారి ద్రవ్యాన్నదానంబులు
చేసినవా రగుచుందురు గావున వా రొనర్చిన స్వల్పదానం
బైన నధికంబుగ నెంచి నీవు వారికి ధనధాన్యంబు లిచ్చు
చుండవలయు, నేను వారికి నయభయంబులం జూపి తద్ద్ర
వ్యాన్నంబు లిచ్చటికి చెప్పించి వారిచేత దానంబులు చేయింపు
చుండవలయు నీ వేంకటాద్రియందుఁ జేసిన దానంబులకు
నధికఫలంబుల నిచ్చు నందు నే నీయుక్తి పన్నితి నీయుక్తి
చేయకుండినఁ గలిపుర్షుండు సకలధర్మంబులం జెఱచి ప్రజల
ననేకవిధంబుల బాధించి నరకంబులం ద్రోయించుం గావున
మదంశసంభవులైన జీవుల కలికాలంబులం దీప్రకారంబు
రక్షించుకొఱకు నే నీయద్రియందు నిలిచితి నీవును నాకు
దోడ్పడి మదర్పణంబులు సేయుటకై ప్రజలకు భాగ్యంబుల
నిచ్చుచుండుమని నిన్నుఁ బ్రార్థించి, నీ విప్పుడ కుబేరుని
యప్పు దీర్చితి వేని నే నిందు నిరుద్యోగంబుగ నుండవలయు
న ట్లూరకుండుట ధర్మంబుగాదు గావున నీ విపు డిట్టి యుద్యో
గంబు నా కొసంగుమనిన విని నవ్వి లక్ష్మీదేవి యిట్లనియె.

153


సీ.

ధన్యాత్మ నీతోడ దబ్బ రాడఁగరాదు
        చెప్పెద నిప్పుడ సిద్ధముగను
మహియందు దానధర్మపరోపకారము
        ల్జేసి నీ కర్పణ చేయుచున్న