పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/461

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

454

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


తే.

యనఁగ హరి యిట్టు లనియె మోక్షార్హులైన
వారలకు ముక్తి కోరికల్ కోరి పుణ్య
కర్మములు సేయువారి కాకర్మఫలము
లిచ్చి రక్షించు నదియ నాకిష్ట మతివ.

151


సీ.

కలుములచెలి నీవు గావునఁ గలుము లి
        చ్చెడుపని నీవంతు చెలఁగి వారి
మెండు రూకల నాక్రమించి యాపదల ని
        వారించి సంతానవరము లొసఁగి
సంతసించుటకు నా వంతని పల్కఁగ
        హరిని వీక్షించి యి ట్లనియె లక్ష్మి
మనుజులు దానధర్మపరోపకారముల్
        చేయరు వారికి సిరుల నొసంగు


తే.

టెల్ల వా రది దెచ్చి నీ కిచ్చు టెల్ల
ధనము గల్గఁగనే దంభదర్పలోభ
ములను బెంచుదు రాద్రవ్యమును నిజముగ
నీకు నొగిఁ దెచ్చి యిత్తురే నీరజాక్ష.

152


వ.

అనిన విని హరి శ్రీలక్ష్మిం జూచి నీవు చెప్పినయట్ల కలియుగము
నందుఁ బుట్టిన నరులట్ల లోభు లగుటకు సందియంబు లేదు
నిక్కంబగు నందొక్కయుక్తి గల దది యెట్లంటివేని జనులు
పాపంబులు సేయుదురు. దాన రోగాది బాధల ననుభవిం
తురు. అట్టి కాలంబున నన్నుఁ దలంతురు. అపు డవ్వారి
స్వప్నంబులం బ్రత్యక్షంబై వారి కలిమికొలఁదిగ ముడుపులు
గట్టించి తద్విత్తంబుసకు నధికంబుగ వడ్డి పెచ్చు పెఱుగనిచ్చి
ప్రతివత్సరంబున వారిని దండించి యీ వేంకటాద్రికిఁ